NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
    భారతదేశం

    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 29, 2022, 12:15 pm 1 నిమి చదవండి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
    చంద్రబాబు కందుకూరు పర్యటనలో విషాదం

    నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ నిలబడటానికి కూడా స్థలం లేకపోవడంతో.. కొందరు కాలువ అంచున నిల్చున్నారు. అనంతరం తోపులాట జరగడంతో.. ఆ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. ప్రధాని మోదీ సంతాపం.. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సంతాపాన్ని తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పును ఆర్థికసాయం ప్రకటించారు మోదీ.

    టీడీపీ వర్సెస్ వైసీపీ

    కందుకూరులో ఇరుకు ప్రదేశంలో రోడ్‌షో పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. జనం ఎక్కువ వచ్చారని చూపించుకోవాలనే తాపత్రయంతోనే చంద్రబాబు.. సందులో రోడ్‌షో పెట్టారని నాయకులు అంటున్నారు. చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్ల 8‌మంది చనిపోయారని విరుచుకుపడుతున్నారు. టీడీపీ కూడా అదేస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతోంది. నామమాత్రపు భద్రత వల్లే ఈ‌ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి ఆయన స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. అలా చేయకుండా.. నలుగురు ఎస్సైలు, ఇద్దరు సీఐలు, స్పెషల్ పార్టీ పోలీసులతో వైసీపీ ప్రభుత్వం సరిపెట్టిందని టీడీపీ విమర్శిస్తోంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం రాష్ట్రప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

    ప్రధాని కార్యాలయం నుండి ట్వీట్

    Pained by the mishap at a public meeting in Nellore, AP. Condolences to the bereaved families. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased and the injured would be given Rs. 50,000: PM @narendramodi

    — PMO India (@PMOIndia) December 29, 2022
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు డిల్లీ క్యాప్‌టల్స్
    డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం ఐపీఎల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస నారా లోకేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం విద్యా శాఖ మంత్రి
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు ప్రధాన మంత్రి
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక

    ప్రధాన మంత్రి

    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023