NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
    తదుపరి వార్తా కథనం
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
    చంద్రబాబు కందుకూరు పర్యటనలో విషాదం

    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

    వ్రాసిన వారు Stalin
    Dec 29, 2022
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

    కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ నిలబడటానికి కూడా స్థలం లేకపోవడంతో.. కొందరు కాలువ అంచున నిల్చున్నారు. అనంతరం తోపులాట జరగడంతో.. ఆ ప్రమాదంలో 8మంది మృతి చెందారు.

    ప్రధాని మోదీ సంతాపం.. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సంతాపాన్ని తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పును ఆర్థికసాయం ప్రకటించారు మోదీ.

    కందుకూరు

    టీడీపీ వర్సెస్ వైసీపీ

    కందుకూరులో ఇరుకు ప్రదేశంలో రోడ్‌షో పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. జనం ఎక్కువ వచ్చారని చూపించుకోవాలనే తాపత్రయంతోనే చంద్రబాబు.. సందులో రోడ్‌షో పెట్టారని నాయకులు అంటున్నారు. చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్ల 8‌మంది చనిపోయారని విరుచుకుపడుతున్నారు.

    టీడీపీ కూడా అదేస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతోంది. నామమాత్రపు భద్రత వల్లే ఈ‌ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి ఆయన స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. అలా చేయకుండా.. నలుగురు ఎస్సైలు, ఇద్దరు సీఐలు, స్పెషల్ పార్టీ పోలీసులతో వైసీపీ ప్రభుత్వం సరిపెట్టిందని టీడీపీ విమర్శిస్తోంది.

    ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం రాష్ట్రప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని కార్యాలయం నుండి ట్వీట్

    Pained by the mishap at a public meeting in Nellore, AP. Condolences to the bereaved families. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased and the injured would be given Rs. 50,000: PM @narendramodi

    — PMO India (@PMOIndia) December 29, 2022
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    నరేంద్ర మోదీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ వై.ఎస్.జగన్
    2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే.. భారతదేశం

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025