NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kamareddy: కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్‌ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత
    తదుపరి వార్తా కథనం
    Kamareddy: కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్‌ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత
    కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్‌ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత

    Kamareddy: కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్‌ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 26, 2024
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్సై సాయికుమార్‌ మృతదేహం రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.

    బుధవారం రాత్రి అదే చెరువు నుంచి కానిస్టేబుల్‌ శ్రుతి, సహకార సంఘం ఆపరేటర్‌ నిఖిల్‌ మృతదేహాలు వెలికివేయడం తెలిసిందే.

    భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌తో పాటు బీబీపేట పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ ఒకేసారి అదృశ్యమయ్యారు.

    అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు అక్కడికెళ్లి గాలింపు చేపట్టారు.

    Details

    ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు

    బుధవారం రాత్రి శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు బయట పడగా, గురువారం ఉదయం సాయికుమార్‌ మృతదేహం లభ్యమైంది.

    ఈ గాలింపుని జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్సై సాయికుమార్‌ సెల్‌ఫోన్‌ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్‌ ఆఫ్‌ కావడంతో పోలీసులు ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు.

    ఇదే సమయంలో బీబీపేట పోలీస్‌ స్టేషన్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిన కానిస్టేబుల్‌ శ్రుతి కూడా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

    శ్రుతి ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఆమె అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు.

    Details

    దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు

    ఎస్పీ నేతృత్వంలో చెరువు వద్ద గాలింపు చేపట్టగా, అక్కడ శ్రుతి సెల్‌ఫోన్‌తో పాటు నిఖిల్‌ సెల్‌ఫోన్‌ కూడా దొరికాయి.

    అదనంగా సాయికుమార్‌ కారు, పాదరక్షలు, నిఖిల్‌ పాదరక్షలు కూడా చెరువు ఒడ్డున కనిపించాయి.

    చెరువులో గాలింపు తర్వాత బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం సాయికుమార్‌ మృతదేహం వెలికితీయడం ద్వారా ఘటన మరింత కలకలం రేపింది.

    ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    వారు అదృశ్యమైన నేపథ్యంలో చెరువు వద్ద కనిపించిన ఆధారాలు, ముగ్గురి మృతదేహాలు ఒకేసారి లభ్యం కావడం కారణంగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రాబోతున్నాయి.

    ఈ సంఘటన కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కామారెడ్డి
    తెలంగాణ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    కామారెడ్డి

    PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్.. బీజేపీ అభ్యర్ధి ముందంజ  బీఆర్ఎస్
    Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌కు ఝలక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు  తాజా వార్తలు
    Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్  విజయశాంతి

    తెలంగాణ

    Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ ప్రభుత్వం
    Telangana Thalli Statue: లక్షలాది మహిళల సమక్షంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రేవంత్ రెడ్డి
    Chapata Mirchi: ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు!  భారతదేశం
    ROR Act: 2024 ఆర్వోఆర్‌ చట్టంలో నూతన మార్పులు.. త్వరలో అమలు ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025