NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!
    తదుపరి వార్తా కథనం
    UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!
    తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!

    UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 09, 2025
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సిక్కింలో హనీమూన్‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నవ దంపతులపై విషాదం ముసురుకుంది.

    యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్‌కు మే 5న అంకితా సింగ్ అనే యువతితో వివాహం జరిగింది.

    అనంతరం మే 24న నూతన వధూవరులు హనీమూన్ కోసం సిక్కింకు పయనమయ్యారు. అయితే మే 29న జరిగిన ఘోర ప్రమాదం వారి జీవితాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.

    ఆరోజు పర్యటన నిమిత్తం వారు ప్రయాణిస్తున్న కారు కొండచరియలు విరిగిపడటంతో అదుపుతప్పి 1,000 అడుగుల లోతున్న తీస్తా నదిలో పడిపోయింది.

    ప్రమాద సమయంలో కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం. వారిలో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.

    Details

    ఎనిమిది మంది గల్లంతు

    డ్రైవర్ మరణించగా, మిగిలిన ఎనిమిది మంది మాత్రం గల్లంతయ్యారు.

    గల్లంతైన వారిలో నూతన వధూవరులతో పాటు నలుగురు ఒడిశా, ఇద్దరు త్రిపురకు చెందినవారున్నట్టు అధికారులు తెలిపారు.

    ఘటన అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

    ఈ నేపథ్యంలో కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, "12 రోజులైనా మా కుమారుడు, కోడలిని గుర్తించలేకపోయాం" అని కన్నీటి పర్యంతమయ్యారు.

    గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, తమ బిడ్డల ఆచూకీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సిక్కింకు సీఎంకి విజ్ఞప్తి చేశారు.

    ఈ ఘటన పర్యాటకుల భద్రతపై అనేక ప్రశ్నలు రేపుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిక్కిం

    తాజా

    UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ! సిక్కిం
    Sindhu Water: సింధు జల ఒప్పందం రద్దు.. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం.. మున్ముందు మరిన్ని కష్టాలు  పాకిస్థాన్
    India vs England: మిడిల్‌ ఆర్డర్‌ లోపం, అనుభవం లేమి.. ఇంగ్లండ్‌లో భారత్‌కు కఠిన పరీక్షలు! భారత జట్టు
    US: లాస్ ఏంజిల్స్ లో కార్లకు నిప్పు,రోడ్లపై US నేషనల్ గార్డ్.. తీవ్ర ఉద్రిక్తతలు అమెరికా

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025