NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి
    తదుపరి వార్తా కథనం
    Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి
    ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన

    Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలతో ముందుకు వచ్చింది.

    ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, విద్యార్థులు, రైతులకు లాభాలు ప్రకటించింది.

    టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒకదాని తర్వాత ఒకటి హామీలను నెరవేర్చుతున్నారు.

    ఇప్పటికే పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి పథకాలు అమలు చేశారు.

    దీపావళి నుంచి మరో పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

    ముఖ్యంగా, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

    ఈ సందర్భంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా చర్చకు వచ్చింది.

    వివరాలు 

    త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ 

    అయితే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కీలక వ్యాఖ్యలు చేసారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

    ఆయన ఉచిత బస్సు ప్రయాణ హామీని త్వరలోనే అమలు చేస్తామన్నారు. పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.

    ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమవుతుందని వార్తలు వెలువడ్డాయి. కానీ వరదల కారణంగా ఈ పథకం అమలు వాయిదా పడింది.

    తాజా సమాచారం ప్రకారం, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం ప్రారంభం కాబోతుండటంతో, ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా త్వరలో అమలు చేసే అవకాశం ఉంది.

    వివరాలు 

    దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు 

    ఆదివారం, రాయచోటి నియోజకవర్గంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా, ఆయన దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు.

    అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించబడతాయని చెప్పారు.

    మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వం లక్ష్యమని, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

    ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    Satyavedu TDP MLA :సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు..  వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!  భారతదేశం
    Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు  భారతదేశం
    AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు వాతావరణ శాఖ
    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి  ప్రకాశం జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025