NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Seaplane: విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్‌' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం 
    తదుపరి వార్తా కథనం
    Seaplane: విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్‌' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం 
    విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్‌' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం

    Seaplane: విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్‌' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 04, 2024
    08:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పర్యాటక రంగంలో విజయవాడ కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఈ నెల 9న పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించే 'సీ ప్లేన్‌' ప్రయోగాన్ని ప్రారంభించనున్నారు.

    డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు.

    విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ప్రయాణం విజయవంతమైతే, రెగ్యులర్ సర్వీసు ప్రారంభించే అవకాశం ఉంది.

    పున్నమిఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి మెరుగులు దిద్దుతున్నారు.

    శనివారం సీ ప్లేన్ శ్రీశైలం పయనించనుంది. శ్రీశైలం పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

    వివరాలు 

    కూటమి ప్రభుత్వంలో నూతన ప్రయోగాలు 

    కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రం పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది.

    ఇటీవల జాతీయ స్థాయిలో డ్రోన్ సమిట్ నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పుడు సీ ప్లేన్ ప్రయోగం చేపడుతోంది.

    2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సీ ప్లేన్ ప్రయోగం ఆలోచన వచ్చినప్పటికీ, వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు పురోగతి లేకపోయింది.

    ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఈ ప్రయోగం మళ్లీ ప్రారంభమైంది.

    పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ సీ ప్లేన్ ప్రయోగాన్ని చేపడుతున్నారు.

    వివరాలు 

    రెండో దశలో మరిన్ని ప్రాంతాలకు..

    దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయ సందర్శకులకు ఈ సీ ప్లేన్ ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.

    ఈ ప్రయోగం విజయవంతమైతే, విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి వంటి ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను రెండో దశలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    పర్యాటకం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    AP Free Gas Cylinders 2024 : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు- అర్హతలివే! భారతదేశం
    Chandrababu: భవిష్యత్తులో డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    AP News: కేంద్రమంత్రితో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ భేటీ.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ  మెట్రో రైలు
    AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర భారతదేశం

    పర్యాటకం

    కిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు  లైఫ్-స్టైల్
    ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు  జీవనశైలి
    వర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి  వర్షాకాలం
    పూరీ జగన్నాథ రథ యాత్ర ఎప్పుడు మొదలు కానుంది? తేదీ, సమయం వివరాలివే?  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025