TS RTC: 'మహాలక్ష్మి' ఎఫెక్ట్.. ఆ రెండు టికెట్లను రద్దు చేసిన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ప్రయాణికుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉందని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. 'మహాలక్ష్మి' పథకం వల్ల రద్దీ పెరిగిన వల్ల.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ-25, టీ-6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. 2024 జనవరి 1 నుంచి ఫ్యామిలీ-25, టీ-6 టికెట్లను జారీ చేయబోమని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.