NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ
    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ
    భారతదేశం

    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    June 10, 2023 | 10:24 am 1 నిమి చదవండి
    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ
    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ

    నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్‌ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్‌-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహించనున్న ఈ పరీక్ష ఉదయం 10.30 - 1 మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తామని కమిషన్ పునరుద్ఘాటించింది. ఈ మేరకు జిల్లాల ఉన్నతాధికారులతో కమిషన్ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి సమీక్షించారు. అనంతరం అధికార యంత్రాంగానికి పరీక్ష నిర్వహణకు సంబంధించిన సూచనలు ఇచ్చారు.

    ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలి : టీఎస్‌పీఎస్సీ

    పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు వచ్చేటప్పుడు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైవా ఓ ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. మొత్తం 3,80,052 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. గత అక్టోబర్ లో నిర్వహించిన ప్రిలిమ్స్ ను దాదాపు 2.86 లక్షల మంది అభ్యర్థులు రాశారు. దాదాపుగా 2.75 లక్షల మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని కమిషన్ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ కోసం 994 పరీక్ష కేంద్రాలను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అయితే ఓఎంఆర్‌ షీట్ పై ప్రశ్నపత్రం కోడ్‌ను కంపల్సరీగా రాయాలని సూచించింది. ఈ కీ ఆధారంగానే వాల్యుయేషన్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    ప్రభుత్వం
    విద్యార్థులు

    తెలంగాణ

    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్  విద్యా శాఖ మంత్రి
    ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది గంగుల కమలాకర్
    విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్‌ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా ప్రభుత్వం

    ప్రభుత్వం

    ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం  ఉద్యోగులు
    తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్ తెలంగాణ

    విద్యార్థులు

    కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్ కెనడా
    తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ తెలంగాణ
    పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT విద్యా శాఖ మంత్రి
    Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి  తెలంగాణ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023