NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ
    తదుపరి వార్తా కథనం
    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ
    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ

    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 10, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్‌ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్‌-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

    రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహించనున్న ఈ పరీక్ష ఉదయం 10.30 - 1 మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది.

    పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తామని కమిషన్ పునరుద్ఘాటించింది. ఈ మేరకు జిల్లాల ఉన్నతాధికారులతో కమిషన్ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి సమీక్షించారు. అనంతరం అధికార యంత్రాంగానికి పరీక్ష నిర్వహణకు సంబంధించిన సూచనలు ఇచ్చారు.

    Details

    ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలి : టీఎస్‌పీఎస్సీ

    పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు వచ్చేటప్పుడు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైవా ఓ ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

    మొత్తం 3,80,052 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. గత అక్టోబర్ లో నిర్వహించిన ప్రిలిమ్స్ ను దాదాపు 2.86 లక్షల మంది అభ్యర్థులు రాశారు.

    దాదాపుగా 2.75 లక్షల మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని కమిషన్ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ కోసం 994 పరీక్ష కేంద్రాలను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

    అయితే ఓఎంఆర్‌ షీట్ పై ప్రశ్నపత్రం కోడ్‌ను కంపల్సరీగా రాయాలని సూచించింది. ఈ కీ ఆధారంగానే వాల్యుయేషన్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం
    విద్యార్థులు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు  వాతావరణ మార్పులు
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  విద్యుత్
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  ఐఎండీ

    ప్రభుత్వం

    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు పాకిస్థాన్
    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO ప్రకటన
    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను రవాణా శాఖ
    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు భారతదేశం

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025