Page Loader
15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు
గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు

15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 05, 2023
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 11న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలను ప్రకటించింది. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తామని స్పష్టం చేసింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లో లోపలికి అనుమతించబోమని తేల్చి చెప్పింది. అభ్యర్థులందరూ ముందుగానే బయల్దేరి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. అలాగే ఓఎంఆర్‌ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే దానికి బదులుగా మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వలేమని వివరించింది. అందువల్ల అభ్యర్థి వ్యక్తిగత వివరాలను, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో మాత్రమే జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలని కోరింది.

Details 

ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలి

సరిగ్గా బబ్లింగ్‌ చేయకపోయినా, పెన్సిల్‌, ఇంక్‌ పెన్‌, జెల్‌ పెన్‌ ఉపయోగించినా, డబుల్‌ బబ్లింగ్‌ చేసినా పత్రాలు చెల్లుబాటు కావని వెల్లడించింది. వచ్చేటప్పుడు ఇవి వెంట తీసుకురావాలి అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రాలైనా ఆధార్‌, పాన్‌ కార్డులు తీసుకురావాలని చెప్పింది. ఒక వేళ అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయితే అందుకు సంబంధించిన ఐడీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్ లేదా ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రంలోని గానీ పరీక్ష హాల్లో గానీ అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా కమిషన్‌ నిర్వహించే ఏ పరీక్షలూ రాయకుండా డిబార్‌ చేస్తామని స్పష్టం చేసింది.