టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల కానుకగా ఉద్యోగులకు మరో విడత డియర్నెస్ అలవెన్స్ (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వివరించారు. అలాగే గతేడాది ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4.9శాతం డీఏను కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నెల వేతనంతో పాటే ఉద్యోగులకు ప్రకటించిన డీఏను ఇవ్వనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్, వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.