NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: తిరుమల వాహనదారులకు టీటీడీ కొత్త సూచనలు
    తదుపరి వార్తా కథనం
    TTD: తిరుమల వాహనదారులకు టీటీడీ కొత్త సూచనలు
    తిరుమల వాహనదారులకు టీటీడీ కొత్త సూచనలు

    TTD: తిరుమల వాహనదారులకు టీటీడీ కొత్త సూచనలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 31, 2024
    01:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 21,098 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించారు.

    ఈ ఒక్క రోజే హుండీ ద్వారా రూ.3.80 కోట్ల ఆదాయం టీటీడీకి లభించింది.

    సర్వదర్శనానికి భక్తుల రద్దీ

    వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఒక కంపార్ట్‌మెంట్ నిండిన నేపథ్యంలో, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడింది.

    వాటికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు అందజేశారు.

    Details

    వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు 

    తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుండి 19 వరకు లక్షలాది మంది భక్తులు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే అవకాశం పొందారు.

    ఈ ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.

    పోలీసుల సమీక్ష

    టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి, తిరుమలలో అన్నమయ్య భవనంలో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

    ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా పోలీసుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

    Details

     వాహనాల రాకపోకల నిర్వహణ 

    వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 13,000 వాహనాలకు అనుకూలంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

    గరుడ సేవ తరహాలో రామ్ బగీచా వద్ద ఎక్కువ సంఖ్యలో బగ్గీలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

    టోకెన్లపై స్పష్టత

    టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు అందిస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ విషయంపై భక్తులకు అవగాహన కల్పించేందుకు వివిధ మార్గాల్లో ప్రచారం చేయాలని ఆయన సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం
    టీటీడీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025