NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరు అరెస్ట్‌.. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం!
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరు అరెస్ట్‌.. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం!
    ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరు అరెస్ట్‌.. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం!

    Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరు అరెస్ట్‌.. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 06, 2025
    09:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

    ఈ క్రమంలో బుద్గాం జిల్లాలో ముష్కరులకు సాయంగా వ్యవహరిస్తున్న ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

    వారిది అనుమానాస్పద కదలికలుగా గుర్తించి చెక్‌పోస్టు వద్ద నాకా తనిఖీల్లో పట్టుకున్నారు. వారి వద్ద నిర్వహించిన తనిఖీలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడింది.

    వాటిలో పిస్టల్‌లు, గ్రనేడ్లు, తూటాలు ఉన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

    ప్రాథమిక విచారణలో ఈ ఇద్దరూ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు వెల్లడైంది. భద్రతా దళాలు వారిపై మరింత విచారణ చేపట్టాయి.

    Details

    కేంద్ర హోంశాఖ కీలక సమీక్షకు రంగం సిద్ధం

    దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్షకు సిద్ధమవుతోంది.

    అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తత అవసరమని సూచించిన కేంద్రం, బుధవారం రోజు సివిల్ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్న ఆదేశాలను ఇచ్చింది.

    ఈ నేపథ్యంతో మాక్‌డ్రిల్స్ ఏర్పాట్లపై మంగళవారం హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించనుంది.

    హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉదయం 10.45 గంటలకు జరిగే ఈ సమీక్షలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 244 జిల్లాల్లో చేపట్టనున్న మాక్‌డ్రిల్స్ ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

    అన్ని రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

    ఈ చర్యలు దేశ భద్రత పరిరక్షణలో భాగంగా భవిష్యత్‌లో చోటుచేసుకునే అత్యవసర పరిస్థితులపై స్పందన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టబడుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఉగ్రవాదులు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    జమ్ముకశ్మీర్

    Saifullah Khalid: పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే? భారతదేశం
    Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు ఇండియా
    Kashmir Terror Attack: భర్తను చంపి..భార్యకు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే.. భారతదేశం
    Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో భారతదేశం

    ఉగ్రవాదులు

    Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్  దిల్లీ
    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి  పాలస్తీనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025