NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో కాంవడ్‌ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో కాంవడ్‌ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం
    దిల్లీలో రెండు లారీలు ఢీ.. నలుగురు యాత్రికులు దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం

    దిల్లీలో కాంవడ్‌ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 13, 2023
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలే దిల్లీలో భారీ వర్షాలకు ప్రజలంతా అల్లాడుతుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి.

    కాంవడ్‌ యాత్రలో పెను విషాదం సంభవించింది. ఓ ట్రక్కు అదుపు తప్పి డివైడర్‌ను దాటి హరిద్వార్‌ వెళ్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన ఉత్తర దిల్లీలోని అలీపూర్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

    ప్రమాదంలో రెండు భారీ వాహనాలు (లారీలు) పరస్పరం ఢీ కొన్నాయి. దీంతో నలుగురు యాత్రికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ప్రమాదంలో 15 మందికిపైగా యాత్రికులు గాయాలబారిన పడ్డారు.

    details

    దిల్లీలో యాత్రికులకు విషాదం

    జీటీ (గ్రాండ్ ట్రంక్) కర్నాల్ మార్గంలో ఓ టూరిస్ట్ ట్రక్కు 20 మంది కాంవడ్‌ యాత్రికులతో హరిద్వార్ కు బయల్దేరింది.

    ఈ నేపథ్యంలోనే దిల్లీ నగరానికి వస్తున్న మరో ట్రక్కు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొంది. ఈ క్రమంలో యాత్రికుల లారీపైకి దూసుకెళ్లి ఘోర ప్రమాదానికి తీరిసింది. హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించారు.

    ఈ మేరకు 15 మంది క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని దిల్లీ నార్త్ జోన్ పోలీసులు వెల్లడించారు.

    ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    రోడ్డు ప్రమాదం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు విమానాశ్రయం
    రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్  ప్రధాన మంత్రి
    సాంకేతిక లోపంతో దిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విమానాశ్రయం
    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025