LOADING...
Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి యూకే గ్రీన్ సిగ్నల్
నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి యూకే గ్రీన్ సిగ్నల్

Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి యూకే గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కీలక పరిణామం చోటు చేసుకుంది. యూకే ప్రభుత్వం నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతానికి బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని వచ్చే నెల 23వ తేదీన భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఆయనను ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో ఉంచే అవకాశం ఉంది. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో దాదాపు రూ. 14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లాడు. ప్రస్తుతం లండన్‌లో ఉండగా, భారత ప్రభుత్వం ఆయనను అప్పగించాలంటూ అభ్యర్థించింది. ఈ కేసుపై యూకే కోర్టులో విచారణ జరగుతోంది.

Details

అమెరికాలో నేహల్ మోదీ అరెస్టు

తాజాగా నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత్‌ అన్ని అవసరమైన వసతులు కల్పిస్తుందని, అత్యంత కట్టుదిట్టమైన ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో ఉంచుతామని హామీ ఇచ్చింది. దాంతో బ్రిటన్ కోర్టు అంగీకరించింది. దీంతో నీరవ్ మోదీని రప్పించడానికి మార్గం సుగమమైంది. అదేవిధంగా ఈ ఏడాది జూలైలో నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్ట్ చేశారు. భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఆయనను అప్పగించాలంటూ అభ్యర్థించగా, ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు నేహల్ మోదీని అదుపులోకి తీసుకున్నారు. నేహల్ మోదీపై PNB కుంభకోణంలో కీలక పాత్ర, అలాగే మనీ లాండరింగ్, నేరపూరిత కుట్ర కేసుల విషయంలో విచారణలు జరగుతున్నాయి.