
#NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్ పోర్టల్ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం జూన్ 6న UMEED పోర్టల్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్) ను ప్రారంభించనుందని సమాచారం.
ఈ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల నమోదును మరింత సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఆరు నెలల వ్యవధిలోపు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలియజేసింది.
వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడానికి, నాణ్యతను మెరుగుపర్చేందుకు ఈ కొత్త పోర్టల్ను అందుబాటులోకి తేనున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే, సాంకేతిక సమస్యలు లేదా ఇతర ముఖ్య కారణాల వల్ల గడువు ముగిసేలోపు వక్ఫ్ ఆస్తులను నమోదు చేయలేకపోతే, అటువంటి ఆస్తులకు ఒకటి నుండి రెండు నెలల వరకు అదనపు గడువు ఇచ్చే అవకాశముంటుందని సమాచారం.
వివరాలు
ఆస్తుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం డేటా
కానీ, ఈ అదనపు సమయం తర్వాత కూడా నమోదు జరగకపోతే, ఆ ఆస్తులను వివాదాస్పదమైనవిగా పరిగణించి వక్ఫ్ ట్రిబ్యునల్కు పంపించనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆస్తుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం డేటాను వినియోగించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్ర వక్ఫ్ బోర్డులే ఈ నమోదు ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి. గడువు నాటికి నమోదు కాకపోతే, ఆ ఆస్తులను కూడా వివాదాస్పదంగా పరిగణించి ట్రిబ్యునల్కు పంపించే చర్యలు చేపట్టబడతాయి.
ఇదిలా ఉండగా, ఇటీవల వక్ఫ్ చట్టం 1995లోని కొన్ని నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
వివరాలు
1995 వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిఖిల్ ఉపాధ్యాయ్
దీనికి అనుబంధంగా, వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ద్వారా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం, ఇప్పటికే పెండింగ్లో ఉన్న వకఫ్ చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషన్లతో పాటు తాజా పిటిషన్ను కూడా పరిశీలనకు తీసుకుంది.
ఈ కేసులో నిఖిల్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి 1995 వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సమయంలో,ఈ చట్టాన్ని సవాలు చేయడానికి 2025లో ఎందుకు వచ్చారనే విషయాన్ని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ను ధర్మాసనం ప్రశ్నించింది.
ఆయన అందించిన సమాధానంలో, తాను 2013లో చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా సవాలు చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
1995 వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్
దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, "అప్పుడు కూడా, 2013 నుండి 2025 వరకు. 12 సంవత్సరాలు. ఆలస్యం ఉంది" అని అన్నారు.
అంతేకాకుండా, 1991 ప్రార్థనా స్థలాల చట్టం, 1992 నాటి జాతీయ మైనారిటీ కమిషన్ చట్టాలను కూడా సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే సుప్రీం కోర్టు విచారిస్తున్నదని న్యాయవాది తెలిపారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ తరపున వాదన వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ - 1995 వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు తాజా పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి కోర్టు ఇంకా అనుమతి ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.