NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి
    భారతదేశం

    ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి

    ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 06, 2023, 10:12 am 0 నిమి చదవండి
    ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి
    ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి

    ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉస్మాన్ సోమవారం మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారాలో పోలీసులు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉస్మాన్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఉస్మాన్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి పంపారు. అక్కడ అతను చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం వైద్యులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

    రెండు రోజుల క్రితం మరో నిందితుడు అర్బాజ్‌ హతం

    ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రతి నిందితుడికి 2.5లక్షల నజరానా ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఎఫ్‌ఐఆర్‌లో విజయ్‌కుమార్ పేరు లేకపోవడంతో ప్రయాగ్‌రాజ్ పోలీసులు అతడికి రూ.50,000 బహుమతిని ప్రకటించారు. విచారణ ప్రారంభంలో అతడిని గుర్తించలేకపోవడంతో అతడిపై పారితోషికం తగ్గిందని పోలీసులు వెల్లడించారు. విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మరికొంత మందితో కలిసి 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన పాల్‌ను వారంరోజుల క్రితం హత్య చేశారు. వారం రోజుల క్రితం ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, జిల్లా పోలీసులు కాల్చిచంపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఉత్తర్‌ప్రదేశ్
    తుపాకీ కాల్పులు

    ఉత్తర్‌ప్రదేశ్

    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం అగ్నిప్రమాదం
    యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు

    తుపాకీ కాల్పులు

    సిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి ఆస్ట్రేలియా
    అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    టెక్సాస్‌ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023