NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్
    జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్

    Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 18, 2024
    03:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్ నేషన్-వన్ ఎలక్షన్( జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానల్ ఈ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

    ఇక ఇది చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలకు వంద రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది.

    ఈ నిర్ణయంతో ప్రజాధనం ఆదా కావడంతో పాటు ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం 

    #NewsAlert🚨 Cabinet approves One Nation One Election #Elections #NDA #OneNationOneElection pic.twitter.com/vqCzdaYkND

    — Moneycontrol (@moneycontrolcom) September 18, 2024

    Details

    ఒకే దేశం, ఒకే ఎన్నికలకు సంపూర్ణ మద్దతు

    సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 మంది ప్రముఖ న్యాయ నిపుణులు "ఒకే దేశం, ఒకే ఎన్నికలు" విధానానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

    కేబినెట్ కూడా ఇటీవలే చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌, చంద్రయాన్‌ విస్తరణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాలతో పాటు, జమిలి ఎన్నికల ప్యానల్ సిఫార్సులు కూడా చర్చకు వచ్చాయి.

    లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు జరగడం వలస కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.

    ఇక అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా ఉత్పత్తి, పనితీరు మెరుగవుతుందని ప్యానల్ పేర్కొంది.

    Details

    15 పార్టీలు వ్యతిరేకం

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల జమిలి ఎన్నికలను అమలుచేయడం తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రకటించారు.

    ప్రధాని మోదీ కూడా గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విధానాన్ని ప్రస్తావించారు.

    అయితే, ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి.

    కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే. ఇది ఆచరణాత్మకం కాదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్‌నాథ్‌ కోవింద్‌
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ

    రామ్‌నాథ్‌ కోవింద్‌

    దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ కేంద్ర ప్రభుత్వం
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్‌ కోవింద్ కీలక ప్రకటన.. సెప్టెంబర్ 23న తొలి సమావేశం జమిలి ఎన్నికలు
    జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ  అమిత్ షా

    కేంద్ర ప్రభుత్వం

    Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు నరేంద్ర మోదీ
    CAA: సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అమల్లోకి వచ్చిన పౌర చట్టం  అమిత్ షా
    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025