NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Union Cabinet: భారత్‌పై అమెరికా 26% సుంకాల వేళ.. క్యాబినెట్ కీలక సమావేశం
    తదుపరి వార్తా కథనం
    Union Cabinet: భారత్‌పై అమెరికా 26% సుంకాల వేళ.. క్యాబినెట్ కీలక సమావేశం
    భారత్‌పై అమెరికా 26% సుంకాల వేళ.. క్యాబినెట్ కీలక సమావేశం

    Union Cabinet: భారత్‌పై అమెరికా 26% సుంకాల వేళ.. క్యాబినెట్ కీలక సమావేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం టారిఫ్‌లు (సుంకాలు) బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.

    ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

    అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ భయాలు పెరుగుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నది.

    ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆ భేటీలో చర్చించనున్నారు.

    ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లలో 10 శాతం అమల్లో ఉంది.

    తాజాగా మరో 16 శాతం బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నాయి. ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యల్లో, మోదీ తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నప్పటికీ, భారత్ అమెరికాతో సరైన రీతిలో వ్యవహరించడంలేదని వ్యాఖ్యానించాడు.

    వివరాలు 

    టారిఫ్‌ల వల్ల కొన్ని రంగాలకు మినహాయింపు

    భారత్ 52 శాతం సుంకాలు విధిస్తోందని, తమది కేవలం దానిలో సగమే అని ట్రంప్ అన్నారు.

    ఈ నేపథ్యంలో,ట్రంప్ విధించిన టారిఫ్‌ల నుండి ఉపశమనం పొందే మార్గాలపై మోదీ ప్రభుత్వం దృష్టిసారించింది.

    అయితే,ఈ చర్యలు పరస్పర ప్రతీకారంగా కాకూడదన్న అభిప్రాయంతో ముందడుగులు వేస్తోంది.

    అటువంటి పరస్పర అవగాహన ఒప్పందాల దిశగా సిద్ధమవుతుందని ఒక ప్రభుత్వ అధికారి ఇటీవల వ్యాఖ్యానించారు.

    ఈ టారిఫ్‌ల వల్ల కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చారు.సెమీకండక్టర్లు,రాగి, ఔషధాలపై సుంకాల నుంచి మినహాయింపు లభించింది.

    కానీ ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక రంగాల్లో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.

    ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం నిర్వహించే సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    కేంద్ర ప్రభుత్వం

    Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్ డొనాల్డ్ ట్రంప్
    India-US: భారత్‌,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక అంతర్జాతీయం
    Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన విశాఖపట్టణం
    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025