NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్ 
    తదుపరి వార్తా కథనం
    Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్ 
    మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్

    Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహా కుంభమేళాలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు.

    అందుకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి స్నానాలు చేశారు.

    అదేవిధంగా కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకొని సరదాగా గడిపారు. ఈ క్రమంలో మంత్రులు, ముఖ్యమంత్రితో సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అనేక కీలక ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు.

    వివరాలు 

    ప్రయాగ్‌రాజ్,పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి

    ముఖ్యంగా గంగానదిపై ఆరు లైన్ల వంతెన నిర్మించే నిర్ణయం తీసుకున్నారు.

    ప్రయాగ్‌రాజ్-చిత్రకూట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

    ప్రయాగ్‌రాజ్,పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించారు.

    మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

    ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రయాగ్‌రాజ్‌ను మిర్జాపూర్, భదోహి, కాశీ, చందౌలీతో కలుపుతూ, ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను గంగా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా అనుసంధానం చేస్తూ, దీన్ని పొడిగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    అనంతరం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, 54 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేశారు.ఇలా చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     జలకలాట లాడుతున్న సీఎం యోగి, మంత్రులు

    VIDEO | Maha Kumbh 2025: UP CM Yogi Adityanath (@myogiadityanath) along with other cabinet ministers take a holy dip in the Sangam, Prayagraj.

    (Full video available on PTI Videos: https://t.co/n147TvrpG7) pic.twitter.com/DIvA6Krz3i

    — Press Trust of India (@PTI_News) January 22, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌

    ఉత్తర్‌ప్రదేశ్

    Work Pressure: విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు ఉద్యోగిని.. పని ఒత్తిడే కారణమన్న సహోద్యోగులు  లక్నో
    Fake marriage promises: పెళ్లి చేసుకుంటానని చెప్పి.. 20 మంది మహిళలను మోసం చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్ నోయిడా
    UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి రోడ్డు ప్రమాదం
    JP Narayan Centre row: సమాజ్‌వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత అఖిలేష్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025