Page Loader
ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి 
ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి

ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి 

వ్రాసిన వారు Stalin
May 03, 2023
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలోని సీబీ గంజ్ ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అలాగే మరో చిన్నారికి గాయాలయ్యాయి. ఖానా గౌన్తియా గ్రామంలో మంగళవారం తన స్నేహితులతో ఆడుకుంటున్న బాధితుడు అయాన్‌పై కుక్కలు దాడి చేశాయి. వీధికుక్కలు అతడిని వెంబడించడంతో బాలుడు ప్రాణాల కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో అతను నేలపై పడిపోయాడు, కుక్కలు అతనిపై దాడి చేశాయి. రోడ్డుపై వెళ్తున్న బాటసారులు బాలుడిపై కుక్కలు దాడి చేయడాన్ని గమనించి అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో అయాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

యూపీ

రెండు నెలల క్రితం మూడేళ్ల బాలిక మృతి

బరేలీలో పిల్లలపై వీధికుక్కలు దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడిలో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తన ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు ఆమెను 150 మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేశాయి. గతేడాది డిసెంబరులో సీబీ గంజ్ ప్రాంతంలోని మథురాపూర్ గ్రామంలో గోలు అనే 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో గాయపడ్డాడు. నగరంలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా అధికార యంత్రాంగానికి, మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.