NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క
    తదుపరి వార్తా కథనం
    UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క
    యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క

    UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క

    వ్రాసిన వారు Stalin
    Oct 10, 2023
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్లు, 4ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను తమ సొంత అక్క(18ఏళ్లు) కిరాతకంగా హత్య చేసింది.

    ఇద్దరు చిన్నారుల తలలను వేరు చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో జరిగింది.

    మృతులను జైవీర్ సింగ్ కుమార్తెలు సుర్భి, రోష్ణిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

    జంట హత్యలు జరిగిన కొన్ని గంటలకే నిందితురాలైన అంజలి పాల్ (18)ను పోలీసులు అరెస్టు చేశారు.

    అలాగే ఆమెకు సహకరించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    హత్య

    పోలీసుల వద్ద అంజలి హైడ్రామా

    అంజలి తన ఇద్దరు చెల్లెళ్లను హత్య చేసిన తర్వాత కొద్ది సేపు హైడ్రామా నడిపించింది.

    తన ఇద్దరు చెల్లెళ్లు హత్యకు గురైనట్లు పోలీసులకు మొదట అంజలినే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

    తాను ఇంటికి వచ్చే సరికి, ఒక గదిలో తన సోదరీమణుల మృతదేహాలు, మరొక గదిలో వారి తలలు కనిపించాయని ఆమె పోలీసులకు చెప్పింది.

    అయితే ఇంటి పరిసరాలను గమనించిన పోలీసులకు శుభ్రం చేసిన పలుగు, బయట ఆరబెట్టిన బట్టలను చూసిన తర్వాత ఇది ఇంట్లోవాళ్లే చేసినట్లు అనుమానించారు.

    పలుగు, బట్టలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా, వాటిపై చిన్నారుల రక్తపు గుర్తులు ఉన్నట్లు తేలింది.

    దీంతో పోలీసులు అంజలిని తమదైన శైలిలో విచారించగా, చివరికి తానే హత్యలు చేసినట్లు ఒప్పుకుంది.

    హత్య

    హత్య ఇంట్లో లేని తల్లిదండ్రులు

    అంజలి కూడా నేరాన్ని అంగీకరించినట్లు కాన్పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.

    ఈ హత్యలు జరిగిన సమయంలో జైవీర్, అతని భార్య సుశీల, వారి కుమారులు నంద్ కిషోర్ (12), కన్హయ్య (8) ఇంట్లో లేరని తెలిపారు.

    పోలీసులు విచారించినప్పుడు నిందితురాలు అంజలి పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

    ఈ కేసులో కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విచారణకు నేతృత్వం వహిస్తున్న ఐజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

    కేసుకు సంబంధించి నిందితురాలతో పాటు మరో ముగ్గురు పురుషులను పోలీసులు ప్రశ్నించారు.

    పూర్తిస్తాయిలో విచారించిన తర్వాత హత్య వెనుక గల కారణాలను వెల్లడిస్తామని ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) సంజయ్ వర్మ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    హత్య
    తాజా వార్తలు

    తాజా

    Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు  ఆంధ్రప్రదేశ్
    Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక ! చమురు
    AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు  ఆంధ్రప్రదేశ్
    Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు   ఇరాన్

    ఉత్తర్‌ప్రదేశ్

    జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ  జ్ఞానవాపి మసీదు
    జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం జ్ఞానవాపి మసీదు
    ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు భారతదేశం
    Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్  సుప్రీంకోర్టు

    హత్య

    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ  ముంబై
    పెళ్లి చేసుకోమ్మన్నందుకు యువతిని చంపి మ్యాన్‌హోల్‌లోకి తోసేసిన ప్రియుడు  హైదరాబాద్
    అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!  అస్సాం/అసోం

    తాజా వార్తలు

    బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్ బిహార్
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    దౌత్య విభేదాల పరిష్కారానికి భారత్‌తో ప్రైవేట్‌గా చర్చించాలనుకుంటున్నాం: కెనడా  కెనడా
    LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు  లద్దాఖ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025