NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarkashi tunnel: నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Uttarkashi tunnel: నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
    నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం

    Uttarkashi tunnel: నార్వే, థాయ్‌లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 16, 2023
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 40మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ గురువారం ఐదవ రోజుకు చేరుకోవడంతో,అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను రక్షించడానికి థాయ్‌లాండ్, నార్వే నుండి నిపుణుల బృందాల సహాయం తీసుకుంటోంది.ఇప్పుడు 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న చెత్త మధ్య 800మిమీ వ్యాసం కలిగిన పైపులు వేస్తున్నారు.

    శిథిలాల మీదుగా స్టీల్ పైపులు వేసి లోపలి నుంచి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    రెస్క్యూ ఆపరేషన్ మొదటి రెండు రోజులు,అధికారులు పెద్ద ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగించారు. సాంకేతిక లోపాలతో అవి శిథిలాలు తొలగించడంలో విఫలమయ్యాయి.

    ప్రస్తుతానికి పైపుల ద్వారానే కార్మికులతో సంభాషణలు జరుగుతున్నాయి.కార్మికులను ఎట్టిపరిస్థితుల్లోనూ సురక్షితంగా బయటకు తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

    Details 

    యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లను రక్షించిన థాయ్ టీం 

    2018లో థాయ్‌లాండ్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్‌లోని వరదలకు గురైన గుహ నుండి 12 మంది యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లను, వారి కోచ్‌ను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది.

    ఇప్పుడిదే టీమ్‌ ఉత్తరాఖండ్‌కి చేరుకుంది. థాయ్‌లాండ్‌తో పాటు నార్వే రెస్క్యూ టీమ్‌ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.

    రెస్క్యూ ఆపరేషన్ మొదటి రెండు రోజుల్లో, అధికారులు పెద్ద ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగించారు.

    సాంకేతిక లోపాలతో అవి శిథిలాలు తొలగించడంలో విఫలమయ్యాయి. దీనిని అనుసరించి, 35-హార్స్ పవర్ (హెచ్‌పి) ఆగర్ యంత్రాన్ని మోహరించారు.

    అయినప్పటికీ, శిధిలాలను తొలగించడంలో అది విఫలమవడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిచిపోయింది.

    రెస్క్యూ టీమ్ ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన 175 హెచ్‌పి ఆగర్ మెషీన్‌పై ఆధారపడుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్నNHIDCL PRO గిర్ధారిలాల్  

    #WATCH | Uttarkashi Tunnel Accident | NHIDCL PRO Girdharilaal says, "We have the support of the administration... We will succeed in this (rescue process). The machine is 99.99% installed. I want to inform everyone not to get misled... Everyone is fine; they don't need medical… pic.twitter.com/euYPgZS26q

    — ANI (@ANI) November 16, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో అమెరికా
    Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు విజయనగరం
    HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి! పవన్ కళ్యాణ్
    Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు  ఆంధ్రప్రదేశ్

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025