NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. వందే భారత్‌ స్లీపర్‌ .. వీడియో
    తదుపరి వార్తా కథనం
    Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. వందే భారత్‌ స్లీపర్‌ .. వీడియో
    గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. వందే భారత్‌ స్లీపర్‌ .. వీడియో

    Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. వందే భారత్‌ స్లీపర్‌ .. వీడియో

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలకు ఎక్కించే పనిలో రైల్వే శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.

    ఈ క్రమంలో,రైలు వేగాన్ని పెంచడానికి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

    ఈ పరీక్షల్లో,రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందించగలిగింది.ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక వీడియో ద్వారా షేర్ చేశారు.

    వీడియోలో వందే భారత్ స్లీపర్ రైలు 180 kmph వేగంతో దూసుకెళ్లినప్పుడు, రైలు సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడలేదు,ఇది అద్భుతంగా కనిపించింది.

    ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.

    వివరాలు 

    వచ్చే నెలలో కూడా ఈ రైల్ ట్రయల్స్

    ప్రారంభంలో జనవరి 1న రైలును 130 kmph వేగంతో నడిపించారు.ఆపై,వేగాన్ని 140, 150, 160 కి పెంచారు.

    చివరకు గురువారం,ఈ వేగం 180 kmphకు పెరిగింది.కోటా నుండి లబాన్ స్టేషన్ల మధ్య ఈ రైలు 180 kmph వేగంతో ప్రయాణించింది.

    ఈ సమయంలో,సాధారణ ప్రయాణికుల బరువును సమం చేస్తూ రైల్లో ఉంచారు. ఈ పరీక్షను విభిన్న ట్రాక్ పరిస్థితుల్లో నిర్వహించారు.

    వచ్చే నెలలో కూడా ఈ రైల్ ట్రయల్స్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

    వందే భారత్ స్లీపర్ రైళ్లను మరికొన్ని నెలల్లో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

    వివరాలు 

    సీటింగ్,లగేజీ (SLR) కోసం రెండు బోగీలు

    ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని, అందులో 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక బోగీ ఫస్ట్ ఏసీ కోసం కేటాయించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

    అదేవిధంగా, సీటింగ్,లగేజీ (SLR) కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ 

    Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025