NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?
    తదుపరి వార్తా కథనం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?
    కాషాయ రంగులో వందే భారత్ రైలు

    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 09, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

    చైన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో శనివారం కషాయ రంగుతో ఉన్న వందేభారత్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    వందే భారత్ రైలు తెలుపు రంగులో ఉండడం వల్ల దుమ్ము ధూళి ఎక్కువగా అంటుకోవడంతో, దీంతో రంగు మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో వందే భారత్ రైలు ఇక కషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి.

    Details

    జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు

    ఇప్పటి వరకు 25రైళ్లలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని, జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

    త్వరలో పర్యాటక మార్గాలను అనుసంధానం చేస్తూ 'టీ ట్రైన్' లను ప్రవేశపెడతామని, అదే విధంగా దక్షిణాదిలో మరెన్నో వందేభాదర్ రైళ్లను ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

    చైన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటివరకూ 70వేల బోగీలు తయారయ్యాయని, ఫీడ్ బ్యార్ ఆధారంగా తాము చాలా మార్పులు చేస్తున్నామని, భద్రతా ఫీచర్ యాంటీ-క్లైంబర్స్‌పై కూడా పని చేస్తున్నామని తెలిపారు.

    2023-24లో ఈ కార్మాగారంలో 736 వందే భారత్ రైలు బోగీలను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు .

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రైల్వే స్టేషన్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025