LOADING...
VHP: దేశవ్యాప్తంగా కార్పొరేట్‌లతో విహెచ్‌పీ భేటీ.. మహిళల భద్రతే అజెండా
కార్పొరేట్ సంస్థలను ఆశ్రయించనున్న విహెచ్‌పీ

VHP: దేశవ్యాప్తంగా కార్పొరేట్‌లతో విహెచ్‌పీ భేటీ.. మహిళల భద్రతే అజెండా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందూ మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో లక్ష్యంగా మారకుండా చూడాలని దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలను సంప్రదించనున్నట్లు Vishwa Hindu Parishad (విహెచ్‌పీ) సీనియర్ నాయకుడు మిలింద్ పరాండే తెలిపారు. మంగళవారం కర్ణాటకలోని హసన్'లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్యాలయాల్లో హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 'లవ్ జిహాద్', బలవంతపు మత మార్పిడి వంటి అంశాలపై వివిధ పరిశ్రమల జాతీయ సంఘాలతో చర్చలు జరపనున్నట్లు చెప్పారు. కేవలం ఐటీ రంగమే కాకుండా అన్ని రంగాల్లో హిందూ మహిళలకు రక్షణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇవి నాగరిక సమాజానికి తగవని అన్నారు.

వివరాలు 

తీవ్ర స్థాయికి రాష్ట్రంలో శువుల అక్రమ రవాణా

ముస్లిం సమాజం కూడా తమ యువతకు అందిస్తున్న విలువలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)నాసిక్ యూనిట్‌లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఘటనల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తెలిపారు. కర్ణాటక పర్యటనలో భాగంగా కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని,సంస్థ విస్తరణ లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణా పెరుగుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో గోరక్షణ చట్టం వచ్చినప్పటికీ కఠినంగా అమలు కావడం లేదని విమర్శించారు. అక్రమ రవాణా మార్గాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తి పునరావృతంగా నేరాలకు పాల్పడితే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

వివరాలు 

అసహనం పెరగడం సహజం 

ప్రో-హిందూ కార్యకర్తలపై వివక్ష చూపుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని, దీనివల్ల వ్యతిరేక ధోరణి ఉందనే భావన కలుగుతోందని ఆయన అన్నారు. చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గోరక్షణ కార్యకర్తలపై దాడుల విషయంపై స్పందిస్తూ, ముందుగా అక్రమ రవాణా ఎందుకు జరుగుతోందో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టాల ఉల్లంఘన, జంతువుల వధ వంటి ఘటనలు పెరుగుతుంటే సమాజంలో అసహనం పెరగడం సహజమని పేర్కొన్నారు. అవసరమైతే కష్టాలను ఎదుర్కొనేందుకు, జైలుకెళ్లడానికి కూడా విహెచ్‌పీ సిద్ధంగా ఉందన్నారు.

Advertisement