NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం
    తదుపరి వార్తా కథనం
    ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం
    అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం

    ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 13, 2023
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన సంఘటన తాజాగా హర్యానా రాష్ట్రంలో జరిగింది.

    హర్యానా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

    ఈ క్రమంలో తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి.

    తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధంచిన ఓ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది.

    ఇటీవలే కురుసిన భారీ వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్‌ దెబ్బతింది. దీంతో దిగువ ప్రాంతమైన ఘులా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.

    details

    భారీ వర్షాల వల్లే ప్రకృతి విపత్తు : ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్

    అయితే సదరు ఏరియాలో పరిస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యే బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే తమ బాధలు వ్యక్తపరిచేందుకు ఎమ్మెల్యేను జనం చూట్టు ముట్టారు.

    తమ దుస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరే కారణమని భావిస్తూ ఓ మహిళ అకస్మాత్తుగా దూసుకొచ్చి ఇప్పుడెందుకు వచ్చావని నిలదీసింది. ఈ మేరకు చెంప చెళ్లుమనిపించింది.

    దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలబడ్డారు.

    అనంతరం ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్, తాను తలుచుకుని ఉంటే డ్యామ్ దెబ్బతినేది కాదని ఆ మహిళ ఆరోపించారని, కాని అదో ప్రకృతి విపత్తని గుర్తు చేశారు.

    సదరు మహిళపై తాను ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోనని, ఆమెను క్షమించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    హర్యానా

    ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ భారతదేశం
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్
    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025