Page Loader
ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం
అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 13, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన సంఘటన తాజాగా హర్యానా రాష్ట్రంలో జరిగింది. హర్యానా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధంచిన ఓ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఇటీవలే కురుసిన భారీ వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్‌ దెబ్బతింది. దీంతో దిగువ ప్రాంతమైన ఘులా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.

details

భారీ వర్షాల వల్లే ప్రకృతి విపత్తు : ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్

అయితే సదరు ఏరియాలో పరిస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యే బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే తమ బాధలు వ్యక్తపరిచేందుకు ఎమ్మెల్యేను జనం చూట్టు ముట్టారు. తమ దుస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరే కారణమని భావిస్తూ ఓ మహిళ అకస్మాత్తుగా దూసుకొచ్చి ఇప్పుడెందుకు వచ్చావని నిలదీసింది. ఈ మేరకు చెంప చెళ్లుమనిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలబడ్డారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్, తాను తలుచుకుని ఉంటే డ్యామ్ దెబ్బతినేది కాదని ఆ మహిళ ఆరోపించారని, కాని అదో ప్రకృతి విపత్తని గుర్తు చేశారు. సదరు మహిళపై తాను ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోనని, ఆమెను క్షమించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.