NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం 
    తదుపరి వార్తా కథనం
    Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం 
    భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం

    Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 07, 2024
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయవాడకు మళ్లీ వరద భయం వెంటాడుతోంది.

    ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సింగ్‌నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం వంటి ప్రాంతాల్లో 1-2 అడుగుల మేర నీరు నిలిచిపోయింది.

    దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి పెద్ద వరద ప్రవాహం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

    శనివారానికల్లా వరద పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

    గత మూడ్రోజులగా వెలగలేరు వద్ద వరద ప్రవాహం 7,000 క్యూసెక్కులు దాటలేదు. బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ వరద ప్రవాహం కూడా తగ్గడం విశేషం.

    Details

    పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

    కృష్ణా జిల్లాలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో వరద ప్రవాహం ఉంది.

    నందివాడ, గుడివాడ, మండవల్లి మండలాల్లో మాత్రం నీటి స్థాయి పెరిగింది. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

    పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఉదయం 32.66 మీటర్లుగా ఉన్న వరద స్థాయి సాయంత్రానికి 32.56 మీటర్లకు తగ్గింది.

    48 గేట్ల ద్వారా 9.76 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కృష్ణా జిల్లా
    విజయవాడ వెస్ట్

    తాజా

    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా
    Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్

    కృష్ణా జిల్లా

    Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!  భారతదేశం

    విజయవాడ వెస్ట్

    బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం అగ్నిప్రమాదం
    BillBoard: వాహ్ తాజ్‌మహల్ టీ కాదు.. తబలాలో ను ప్రత్యేకత లైఫ్-స్టైల్
    Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి కొండచరియలు
    Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025