Page Loader
Vikash Yadav: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో దోపిడీ.. పన్నూన్ కేసులో 'వాంటెడ్'.. రా మాజీ అధికారి  అరెస్టు  
పన్నూన్ కేసులో 'వాంటెడ్'.. రా మాజీ అధికారి అరెస్టు

Vikash Yadav: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో దోపిడీ.. పన్నూన్ కేసులో 'వాంటెడ్'.. రా మాజీ అధికారి  అరెస్టు  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా (USA) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తు భాగంగా భారత మాజీ ఇంటెలిజెన్స్ (RAW) అధికారి వికాస్‌ యాదవ్‌పై ఇటీవల అభియోగాలు నమోదవ్వడం,చర్చనీయాంశమైంది. వికాస్‌ పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అధికారిని ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం వచ్చింది. ఈ విషయం సంబంధించి జాతీయ మీడియాల్లో కథనాలు ప్రచురించబడ్డాయి.

వివరాలు 

వికాస్‌ యాదవ్‌ పై మనీలాండరింగ్‌,పన్నూ హత్యకు ప్రణాళిక అభియోగాలు

ఈ కుట్ర కేసుకు సంబంధించిన న్యూయార్క్‌లోని కోర్టులో న్యాయశాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో భారత పౌరుడు వికాస్‌ యాదవ్‌ (39)పై మనీలాండరింగ్‌, కుట్రకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియనట్లు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొనబడింది. వికాస్‌ గతంలో భారత ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించాడు. ఆయన భారత విదేశీ ఇంటెలిజెన్స్‌ విభాగం, రా విభాగాన్ని నిర్వహించే కేబినెట్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా పనిచేసాడు.

వివరాలు 

అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర

అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం గతేడాది ఆరోపించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేయాలనే కుట్రను నిఖిల్‌ గుప్తా పన్నాడని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇప్పటికే చెక్‌ రిపబ్లిక్‌ జైలులో ఉన్న నిఖిల్‌ను అమెరికాకు అప్పగించినట్లు ఇటీవల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసు వ్యవహారంపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు కూడా జారీ చేసింది.

వివరాలు 

భారత అధికారుల బృందం అమెరికాలోని విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశం 

అయితే, ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. దీనిపై విచారణ జరిపేందుకు స్వదేశంలో ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత అధికారుల బృందం అమెరికాలోని విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది. ఈ అభియోగాల్లో పేర్కొన్న భారత అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని న్యూదిల్లీ తమకు వెల్లడించినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. ఈ బృందం పర్యటన ముగిసిన తర్వాతే వికాస్‌ యాదవ్‌పై అగ్రరాజ్యం అభియోగాలు నమోదు చేయడం గమనార్హం.