
Ambati Rambabu: జగన్ పర్యటనలో నిషేదాజ్ఞలు ఉల్లంఘన.. అంబటి రాంబాబుపై కేసు!
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా అంబటి నిషేదాజ్ఞలను ఉల్లంఘించడం ద్వారా పోలీసుల దృష్టికి వచ్చారు. ఈ క్రమంలో నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అంబటితో పాటు పలువురు వైకాపా నేతలపై కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. తాజాగా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.
Details
పోలీసులతో వాగ్వాదం
మాజీ సీఎం జగన్ పర్యటన సమయంలో కొర్రపాడు వద్ద అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళితో కలిసి అరాచకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారికేడ్లు తోసేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, వారించిన పోలీసులను నెట్టివేశారు. విధులను అడ్డుకుని, పోలీసులపై దాడి చేసినట్టు ఐపీసీ సెక్షన్లు 188, 332, 353, 427 కింద కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.