NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ
    తదుపరి వార్తా కథనం
    Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ
    మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ

    Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ

    వ్రాసిన వారు Stalin
    Jul 10, 2023
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. భద్రతా బలాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మణిపూర్‌లో జాతి ఘర్షణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

    సుప్రీంకోర్టులో గత కొన్ని వారాలుగా జరుగుతున్న మణిపూర్‌ అల్లర్లకు సంబంధించి విచారణలు హింసను పెంచేవిధంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది.

    మణిపూర్‌లో హింసను అణిచివేసేందుకు శాంతిభద్రతల యంత్రాంగాన్ని తమ చేతిలోకి తీసుకోలేమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

    మణిపూర్‌లో మైతీ- కుకీ వర్గాల మధ్య జరుగుతున్న హింసకు సంబంధించిన పిటిషన్‌‌లను విచారిస్తున్న సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.

    సుప్రీంకోర్టు

    భద్రత మా పని కాదు: సుప్రీంకోర్టు

    రాష్ట్రంలో జరుగుతున్న హింసను మరింత పెంచడానికి సుప్రీంకోర్టు వేదికగా మారకూడదని సీజేఐ అన్నారు. తాము భద్రత, చట్టాన్ని అమలు చేసే యంత్రాగాన్ని నడిపించడం లేదని, కేవలం ఆదేశాలు మాత్రమే ఇవ్వగలమని చెప్పారు.

    రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, హింసను అరికట్టేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసినట్లు మణిపూర్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలియజేశారు.

    మణిపూర్ ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్‌పై తన నిర్మాణాత్మక సూచనలతో కూడిన నోట్‌ను దాఖలు చేయాల్సిందిగా కుకీ గ్రూప్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్‌ను సుప్రీంకోర్టు కోరింది. మణిపూర్ హింసకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    సుప్రీంకోర్టు
    డివై చంద్రచూడ్
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఇంఫాల్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  ఆర్మీ

    సుప్రీంకోర్టు

    గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా  డివై చంద్రచూడ్
    'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్
     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సీబీఐ

    డివై చంద్రచూడ్

    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శివసేన
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి మహారాష్ట్ర
    దినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం  హైదరాబాద్
    తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025