NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: విశాఖలో లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌.. షాపింగ్‌ మాల్‌ కోసం భూముల కేటాయింపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: విశాఖలో లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌.. షాపింగ్‌ మాల్‌ కోసం భూముల కేటాయింపు
    విశాఖలో లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌.. షాపింగ్‌ మాల్‌ కోసం భూముల కేటాయింపు

    Visakhapatnam: విశాఖలో లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌.. షాపింగ్‌ మాల్‌ కోసం భూముల కేటాయింపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 27, 2025
    08:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలో లులూ గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

    లులూ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను సమీక్షించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏపీఐఐసీకి (ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) అప్పగించింది.

    ఈ క్రమంలో, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పరిధిలోని 13.43 ఎకరాల హార్బర్‌ పార్కు భూమిని ఏపీఐఐసీకి బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

    ఈ స్థలంలో లులూ సంస్థ చిల్డ్రన్స్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, ఫుడ్‌కోర్టు, 8 స్క్రీన్‌లతో కూడిన ఐమ్యాక్స్‌ మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది.

    వివరాలు 

    హార్బర్‌ పార్కు భూమిని మాల్‌ నిర్మాణానికి కేటాయింపు 

    2014 నుండి 2019 మధ్య, అప్పటి ప్రభుత్వంతో లులూ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది, దీనిలో భాగంగా విశాఖ బీచ్‌రోడ్డులోని హార్బర్‌ పార్కు భూమిని మాల్‌ నిర్మాణానికి కేటాయించారు.

    అయితే, 2023లో గత ప్రభుత్వం ఈ భూమిని రద్దు చేయడంతో, లులూ సంస్థ పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

    తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సంస్థతో తిరిగి సంప్రదింపులు జరిపింది, తద్వారా లులూ మరోసారి పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.

    ఈ నెల 13న నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో లులూ సంస్థ ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

    వివరాలు 

    లులూ సంస్థ కోరిన మినహాయింపులు: 

    షాపింగ్ మాల్‌ కోసం భూమిని 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించాలి.

    మూడేళ్లు లేదా షాపింగ్‌ మాల్‌ ప్రారంభించే తేదీ వరకూ (ఏది ముందైతే) అద్దె మినహాయింపు ఇవ్వాలి.

    ప్రతి 10 ఏళ్లకోసారి అద్దెను 10% పెంచే విధానం అనుసరించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    విశాఖపట్టణం

    Fake CBI Gang Cleans: నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్‌ ...MNC,AGMకి రూ .85 లక్షల టోకరా  భారతదేశం
    Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు భారతదేశం
    Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం ఆంధ్రప్రదేశ్
    Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025