NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vizag Steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    Vizag Steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం 
    సెయిల్‌లో వైజాగ్‌ స్టీల్‌ విలీనం!

    Vizag Steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థికంగా నష్టపోతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)తో విలీనం చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

    ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక, నిర్వహణ సంబంధిత నష్టాలను ఎదుర్కొంటుంది.

    ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం సెయిల్‌తో విలీనం చేయడం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.

    భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు రుణాలు వంటి ఇతర అవకాశాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది.

    ఇటీవల, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ఉన్నతాధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమావేశమయ్యారు.

    వివరాలు 

    ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన

    "వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను సెయిల్‌తో విలీనం చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ ప్లాంట్‌కు రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం NMDCకి 1,500-2,000 ఎకరాల భూమిని విక్రయించే యోచన కూడా ఉంది" అని సంబంధిత వర్గాలు తెలిపారు.

    నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. కనీస సామర్థ్యంతో పనిచేయడం వల్లే నష్టాలు పెరిగాయన్న అంచనాకు కేంద్రం వచ్చింది.

    అయితే, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారని తెలుస్తోంది.

    వివరాలు 

    సెయిల్‌తో విలీనం కావాలనే డిమాండ్‌

    ఇతర ఉక్కు పరిశ్రమల కంటే విస్కాహ్ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

    సెయిల్‌తో విలీనం కావాలనే డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో, స్టీల్ ప్లాంట్‌ ఉనికికి సెయిల్‌లో విలీనం చేసేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    విశాఖపట్టణం

    విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్ ఆంధ్రప్రదేశ్
    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు రోడ్డు ప్రమాదం
    పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్  ఆంధ్రప్రదేశ్
    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025