Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థికంగా నష్టపోతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)తో విలీనం చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక, నిర్వహణ సంబంధిత నష్టాలను ఎదుర్కొంటుంది.
ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం సెయిల్తో విలీనం చేయడం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.
భూములను ఎన్ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు రుణాలు వంటి ఇతర అవకాశాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది.
ఇటీవల, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ఉన్నతాధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమావేశమయ్యారు.
వివరాలు
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన
"వైజాగ్ స్టీల్ ప్లాంట్కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను సెయిల్తో విలీనం చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ ప్లాంట్కు రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం NMDCకి 1,500-2,000 ఎకరాల భూమిని విక్రయించే యోచన కూడా ఉంది" అని సంబంధిత వర్గాలు తెలిపారు.
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. కనీస సామర్థ్యంతో పనిచేయడం వల్లే నష్టాలు పెరిగాయన్న అంచనాకు కేంద్రం వచ్చింది.
అయితే, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారని తెలుస్తోంది.
వివరాలు
సెయిల్తో విలీనం కావాలనే డిమాండ్
ఇతర ఉక్కు పరిశ్రమల కంటే విస్కాహ్ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
సెయిల్తో విలీనం కావాలనే డిమాండ్ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, స్టీల్ ప్లాంట్ ఉనికికి సెయిల్లో విలీనం చేసేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.