NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NIA:పరారీలో ఉన్న లష్కరే ఉగ్రవాది.. రువాండా నుంచి రప్పించిన ఎన్‌ఐఏ
    తదుపరి వార్తా కథనం
    NIA:పరారీలో ఉన్న లష్కరే ఉగ్రవాది.. రువాండా నుంచి రప్పించిన ఎన్‌ఐఏ
    పరారీలో ఉన్న లష్కరే ఉగ్రవాది.. రువాండా నుంచి రప్పించిన ఎన్‌ఐఏ

    NIA:పరారీలో ఉన్న లష్కరే ఉగ్రవాది.. రువాండా నుంచి రప్పించిన ఎన్‌ఐఏ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    02:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ కేరాఫ్ ఉగ్రవాది ఎట్టకేలకు భారత్‌ అధికారుల చేతికి చిక్కాడు.

    దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి పరారైన అతనిని రువాండాలో గుర్తించారు.

    ఇంటర్‌పోల్ సహకారంతో సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడిని స్వదేశానికి రప్పించారు. ఈ విషయాన్ని గురువారం సంబంధిత అధికారులు వెల్లడించారు.

    లష్కరే తోయిబా సభ్యుడు సల్మాన్ రెహ్మాన్ ఖాన్‌ బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    బెంగళూరు జైళ్లపై ఉగ్రదాడుల కోసం ఆయుధాలు,పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు కేసు నమోదైంది.

    వివరాలు 

    నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ

    ఈ విచారణను ఎన్‌ఐఏ చేపట్టింది. నిందితుడు విదేశాలకు పారిపోయినట్లు గుర్తించిన తర్వాత, ఎన్‌ఐఏ, సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించాయి. ఆగస్టు 2న అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది.

    తద్వారా, నవంబరు 27న అతనిని రువాండాలోని కిగాలీ ప్రాంతంలో అరెస్టు చేశారు.

    తర్వాత అతడిని భారత్‌కు అప్పగించారు. గురువారం నిందితుడిని దేశానికి తీసుకురాగా, ఎన్‌ఐఏ అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్ఐఏ
    సీబీఐ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉగ్రవాదులు
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్

    సీబీఐ

    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ వైఎస్సార్ కడప
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్ ఆంధ్రప్రదేశ్
    గాలి జనార్దన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ..82 ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం కర్ణాటక
    సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025