NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్
    తదుపరి వార్తా కథనం
    భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్
    భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై విమర్శలు

    భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్

    వ్రాసిన వారు Stalin
    Jun 26, 2023
    02:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

    అవంతిక ఎక్స్‌ప్రెస్‌లోని ఒక ప్రయాణికుడు వర్షం పడుతున్న సమయంలో ఏసీ కోచ్ పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుండగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

    ఏసీ కోచ్‌ పైకప్పు లీకైన నేపథ్యంలో భారతీయ రైల్వేపై నెటిజన్లతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

    భారతీయ రైల్వే కొత్తగా షవర్ సౌకర్యాన్ని రైళ్లలో ప్రవేశపెట్టినట్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

    ఆ వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది. ప్రచారానికి పరిమితం అయ్యేకంటే రైల్వేకోసం కొంత పని చేసి ఉంటే బాగుండేదని పేర్కొంది.

    భారతీయ రైల్వే దుస్థితికి బాధ్యులెవరు? అని మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ప్రశ్నించారు.

    రైలు

    భారతీయ రైల్వేపై మండిపడ్డ నెటిజన్లు

    ఇండియన్ రైల్వే ఓపెన్ షవర్ సౌకర్యంతో కొత్త సూట్ కోచ్‌ను ప్రారంభించిందని ఓ ట్విట్టర్ వినియోగదారు వ్యంగ్యంగా స్పందించాడు.

    ఈ రైళ్లలో ప్రయాణీకులకు షవర్ జెల్, షాంపూ, బాత్రోబ్ అందించడం గురించి భారతీయ రైల్వే చర్చిస్తున్నట్లు మరో వినియోగదారుడు కామెంట్ చేశాడు.

    2-టైర్ ఏసీ సీటు కోసం ప్రీమియం ఛార్జీని చెల్లించినప్పటికీ, ప్రయాణీకులు గణనీయమైన అసౌకర్యాలను భరిస్తూనే ఉన్నారని ఇంకో వినియోగదారుడు ట్వీట్ చేశాడు.

    వర్షపు నీటి సంరక్షణతో వందే భారత్‌ను కూడా చేర్చాలని ఒకరు పేర్కొన్నారు.

    రైళ్లలో హై-ఎండ్ టెక్నాలజీ కూలింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అని ఓ వినియోగదారుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశాడు.

    రైలు

    ఏసీ కోచ్‌ పైకప్పు లీకుపై స్పందించిన పశ్చిమ రైల్వే

    ఏసీ కోచ్‌ పైకప్పు లీకైన వీడియో వైరలైన కొన్ని గంటల తర్వాత పశ్చిమ రైల్వే స్పందించింది. సమస్యను పరిష్కరించామని చెప్పింది.

    అవంతిక ఎక్స్‌ప్రెస్‌లోని అన్ని కోచ్‌లను క్షుణ్ణంగా పరిశీలించామని వెల్లడించింది.

    గత ఏడాది జులైలో పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో కూర్చున్న ప్రయాణికులు లీకేజీ రూఫ్ సమస్యను ఎదుర్కొన్నారు. అనేక ఫిర్యాదుల తర్వాత, ఏసీ కోచ్‌ను తొలగించి దాని స్థానంలో మరొక కోచ్‌ను ఏర్పాటు చేశారు.

    దేశంలోని రైళ్ల దుస్థితిపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

    ప్రభుత్వం బాగా నడుస్తున్న రైళ్లను నాశనం చేసిందని అన్నారు. రైలు కోచ్‌లను ప్రయాణికులకు 'హింస కేంద్రాలు'గా మార్చారని ఆర్‌జేడీ మండిపడింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియో

    काश खोखले प्रचार की जगह रेलवे के लिए कुछ काम किया होता।

    झंडी दिखाने वाले रेल मंत्री अभी विदेश में हैं, नाम वाले रेल मंत्री ध्यान दें। pic.twitter.com/FNLvQL1Ihu

    — Congress (@INCIndia) June 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోషల్ మీడియా
    రైల్వే శాఖ మంత్రి
    తాజా వార్తలు
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ట్విట్టర్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం పాకిస్థాన్
    WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?  భారతదేశం
    బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలి 31మంది మృతి చైనా
    వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా  నరేంద్ర మోదీ

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025