NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!
    ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!

    Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

    ఈ నేపథ్యంలో పాక్‌తో తాజా కాల్పుల విరమణ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ లోని కొంతమంది నేతలు సమర్థిస్తుండగా, మరికొంతమంది మాత్రం ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తూ మోదీ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    1971 యుద్ధ సందర్భంలో ఇందిరా గాంధీ భారత సైనికులతో కలిసి దిగిన చారిత్రక ఫోటోలను హస్తం పార్టీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నేటి పరిస్థితులతో పోల్చుతున్నారు.

    Details

    ప్రజలకు స్పష్టత ఇవ్వాలి

    'ఇందిర ధైర్యంగా వ్యవహరించారు. దేశ రక్షణ కోసం రాజీ పడలేదు. ఆమె లేని లోటు కనిపిస్తోందంటూ నెట్టింట కామెంట్లు వస్తున్నాయి.

    'జాతి పౌరుషాన్ని కాపాడిన నేత'గా ఆమెను ప్రశంసిస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపింది.

    ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

    పార్లమెంటులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, జరిగిన పరిణామాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

    Details

    మోదీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు

    కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, "అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన వెంటనే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.

    దేశ ప్రజలు అనేక విషయాలపై స్పష్టత కోరుతున్నారు. వాటిపై పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించి చర్చ జరగాలని కోరారు.

    ఈ పరిణామాలతో, పాక్‌తో సంబంధాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వివిధ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

    చరిత్రను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు, వ్యతిరేకతా స్వరాలు వినిపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    నరేంద్ర మోదీ

    తాజా

    Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు! కాంగ్రెస్
    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు! శ్రీశైలం
    Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్‌ మంత్రి ప్రకటన పాకిస్థాన్
    Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా! డొనాల్డ్ ట్రంప్

    కాంగ్రెస్

    Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి
    Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం రేవంత్ రెడ్డి
    Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు రాహుల్ గాంధీ
    Congress: ఆరోగ్య శాఖలో రూ.382 కోట్లు అవినీతి.. అప్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    నరేంద్ర మోదీ

    PM Modi AC Yojana: పీఎం మోదీ ఎసీ యోజన 2025 కింద ఉచితంగా ఏసీలు.. ఇందులో నిజమెంత? భారతదేశం
    PM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ భారతదేశం
    PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం  అశ్విని వైష్ణవ్
    PM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్‌ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025