
Amaravati: ఇస్రో సహకారంతో మొబైల్ సిగ్నల్ లేకపోయిన వాతావరణ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టీజీఎస్ (RTGS) ఆధ్వర్యంలో 'ఎవేర్' (AWARE) సిస్టమ్ ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేసే అందుబాటులోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా, ఏపీలోని ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంచుకొని, మొత్తం 26 గ్రామాల్లో ఈ విధానం అమలు చేయబడింది. ప్రతి గ్రామంలో సైరన్ ఏర్పాటు చేస్తారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే, మైక్రోఫోన్ల ద్వారా సైరన్ వినిపించి, స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తుంది.
వివరాలు
ఏంటి ప్రత్యేకత?
ఎవేర్ సిస్టమ్ ద్వారా 42 విభిన్న అంశాలపై హెచ్చరికలు ఇవ్వడం సాధ్యం. ప్రస్తుతానికి 18 రకాల వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నారు. భారీవర్షం, వరదలు, భూకంపం, పిడుగులు, ఈదురుగాలులు, వడగాలులు, జలాశయ నీటిమట్టాలలో హెచ్చుతగ్గులు. పరీవాహక ప్రాంతంలో అధిక వర్షపాతం, గాలినాణ్యత వివరాల్ని ఎవేర్ ద్వారా తెలియజేస్తారు. ఎవేర్ వెబ్సైట్ను ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలు వాడుతూ వాతావరణ పరిస్థితులపై అప్డేట్స్ పొందుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మొబైల్ సిగ్నల్ పనిచేయకపోయినా, ఇస్రో ఉపగ్రహాల సహాయంతో ఎలర్ట్ కేంద్రాలు హెచ్చరికలను జారీ చేస్తాయి.
వివరాలు
త్వరలో 600 గ్రామాల్లో అందుబాటులోకి
త్వరలో సుమారు 600 గ్రామాల్లో ఈ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రతి ఎలర్ట్ బ్రాడ్కాస్ట్ సెంటర్ ఏర్పాటుకు సుమారు రూ. 2 లక్షల వ్యయం ఖర్చవుతుందని, తక్కువ ఎత్తులో ఉన్న భవనాల్లో సిస్టమ్ అమర్చినట్లు మంగళవారం కలెక్టర్ల సదస్సులో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరించారు. చంద్రబాబు నాయుడు సూచన ప్రకారం, వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువ ఉన్న గ్రామాల్లో ఈ సిస్టమ్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించబడింది. ప్రారంభ దశలో సుమారు 600 గ్రామాల్లో దీనిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.