LOADING...
Telangana: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్

Telangana: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'వెల్‌కమ్‌ కిట్‌' అందించే దిశగా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతో నివేదిక పంపినట్లు సమాచారం. విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ కిట్‌ను రూపొందిస్తున్నారు. వెల్‌కమ్‌ కిట్‌లో విద్యార్థులకు అవసరమైన ఏకరూప దుస్తులు, నోట్‌ బుక్స్‌, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ తదితర సామగ్రిని అందించాలన్నది శాఖ ఆలోచన. ప్రభుత్వం ఆమోదం తెలుపితే, జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యే రోజే విద్యార్థుల చేతికి ఈ కిట్‌లు అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

వివరాలు 

పథకం అమలు చేయడానికి సుమారు రూ.70 కోట్ల వరకు వ్యయం

ఈ పథకాన్ని అమలు చేయడానికి సుమారు రూ.70 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'సమగ్ర శిక్షా' పథకం ఒకటి నుంచి 12వ తరగతి వరకు వర్తిస్తుండగా,తొలిసారిగా 2025-26 విద్యా సంవత్సరంలో క్రీడా సామగ్రి, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ల్యాబ్‌ల అభివృద్ధి వంటి అంశాలకు పాఠశాల విద్యాశాఖ ఆ నిధులను వినియోగించింది. ఇదే పథకం నుంచి ఈసారి వెల్‌కమ్‌ కిట్‌కు అవసరమైన నిధులు కేటాయించాలని ఇంటర్‌ విద్యాశాఖ ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా, వీటిలో చదువుతున్న సుమారు 1.80 లక్షల మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఈ వెల్‌కమ్‌ కిట్‌ ద్వారా లబ్ధి పొందనున్నారు.

వివరాలు 

కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 90 శాతం మంది పేద కుటుంబాలకు చెందినవారు 

ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న ఆశాభావంతో అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇలాంటి కిట్‌ల అవసరంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తోంది. అయితే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఆ సదుపాయం లేకపోవడం వల్ల అసమానత కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 90 శాతం మంది పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో, యూనిఫామ్‌ కొనుగోలు, పుస్తకాల కోసం ఖర్చు చేయడం తల్లిదండ్రులకు భారంగా మారుతోంది.

Advertisement

వివరాలు 

ఈ కిట్‌లో రికార్డులు, ప్రత్యేక నోట్‌లు, వర్క్‌బుక్స్

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌ దుస్తులు, అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, వర్క్‌బుక్స్‌ను వెల్‌కమ్‌ కిట్‌ రూపంలో అందించాలని శాఖ నిర్ణయించింది. అలాగే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్‌ అమలు చేయనున్న నేపథ్యంలో, వాటికి అవసరమైన రికార్డులు, ప్రత్యేక నోట్‌లు, వర్క్‌బుక్స్‌ను కూడా ఈ కిట్‌లో చేర్చాలని ప్రతిపాదించింది.

Advertisement