NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ 
    తదుపరి వార్తా కథనం
    West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ 
    భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్

    West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ 

    వ్రాసిన వారు Stalin
    Jul 11, 2023
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ మంగళవారం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు.

    ఉదయం 8:00 గంటల నుంచి రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 339 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.

    భద్రతా దళాలు, సీసీటీవీ నిఘాలో కౌంటింగ్ చేపడుతున్నారు. దాదాపు వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ వరకు దాదాపు మొత్తం మూడంచెల వ్యవస్థలోని 74,000స్థానాల్లో ఎవరు గెలుస్తారో నేడు తేలనుంది.

    జూన్ 8న ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో చేలరిగిన రాజకీయ హింసాకాండలో 42మంది మరణించారు.

    2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజున 12 మంది మృతి చెందారు.

    హింస నేపథ్యంలో 19జిల్లాల్లోని 696 బూత్‌లలో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు.

    పశ్చిమ బెంగాల్

    పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఎంసీ, బీజేపీ

    రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎలక్షన్లు కావడంతో అటు బీజేపీ, ఇటు టీఎంసీ ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి.

    సార్వత్రిక ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు సెమీఫైనల్‌గా రెండు పార్టీలు భావించాయి.

    2021లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అందుకు ప్రతీకారంగా ఈ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది.

    మొదటి రౌండ్ నుంచి టీఎంసీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నట్లు ఫలితాలు చెబుతున్నాయి.

    ఇదిలా ఉంటే, డైమండ్ హార్బర్‌లోని కౌంటింగ్ బూత్‌లో ఉదయం 9:00 గంటలకు పేలుడు సంభవించింది.

    2018 ఎన్నికల్లో టీఎంసీ ఏకగ్రీవంగా 34శాతం సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి బీజేపీ నుంచి పోటీ బలంగా ఎదురైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లెక్కింపు కేంద్రాన్ని సందర్శిస్తున్న గవర్నర్ ఆనంద్ బోస్

    #WATCH | West Bengal Governor CV Anand Bose visited a counting centre in South 24 Parganas this morning.

    Counting of votes for Panchayat election is underway. pic.twitter.com/fMKurbq2wV

    — ANI (@ANI) July 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్

    తాజా వార్తలు

    Delhi: దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పుల కలకలం దిల్లీ
    Personal Data Protection Bill: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  కేంద్ర ప్రభుత్వం
    తీస్తా సెతల్వాద్‌కు ఊరట; మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు  గుజరాత్
    NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025