NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు 
    వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు

    Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో (Kumbh Mela) ఘోర తొక్కిసలాట సంభవించింది.

    ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి, మరి కొంతమంది గాయాలపాలైనట్లు సమాచారం అందుతోంది.

    ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ సంఘటనపై స్పందించారు.

    ఆయన తెలిపినదాని ప్రకారం, పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల జాగ్రత్తలు తీసుకోకుండా వీఐపీల తరలింపులో ఎక్కువ దృష్టి పెట్టడం ఈ ప్రమాదానికి కారణమని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికపై ఒక పోస్ట్‌ను ప్రచురించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ 

    प्रयागराज महाकुंभ में भगदड़ के कारण कई लोगों के मौत और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद है।

    शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।

    इस दुखद घटना के लिए कुप्रबंधन, बदइंतजामी और आम श्रद्धालुओं की जगह VIP…

    — Rahul Gandhi (@RahulGandhi) January 29, 2025

    వివరాలు 

    ప్రభుత్వం త్వరగా జాగ్రత్తలు తీసుకోవాలి: రాహుల్ 

    "మహా కుంభమేళాలో (Mahakumbha Mela) జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, గాయాలపాలయ్యారు. ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా వీఐపీల తరలింపుపై ఎక్కువ దృష్టి పెట్టడమే ఈ విషాద ఘటనకు కారణం. ఈ మహా కుంభమేళాలో మరికొన్ని మహాస్నానాలు ఇంకా జరగాల్సి ఉంది. ప్రభుత్వం త్వరగా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ఘోర ఘటనలు మళ్లీ జరగకుండా, వ్యవస్థను మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. వీఐపీ సంస్కృతిని అరికట్టి, సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వాలి" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    వివరాలు 

    ఐపీల రాకపోకలను నియంత్రించాలి: ఖర్గే 

    ఈ ప్రమాదానికి అరకొర ఏర్పాట్లు కారణమని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఎక్స్ వేదికపై ఆరోపించారు.

    "అన్ని చర్యలకు కూర్చున్న రూ.వేల కోట్ల ఖర్చు కూడా ఏర్పాట్ల పరంగా సరైన పద్ధతిలో ఉండకపోవడం శోచనీయమైంది. భక్తుల సౌకర్యాలకు కన్నా స్వీయ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు" అని ఆయన పేర్కొన్నారు.

    "ప్రభుత్వాలు మేల్కొని, సామాన్య భక్తులకు అవసరమైన మౌలిక వసతులు అందించి, వీఐపీల రాకపోకలను నియంత్రించాలని కోరుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మల్లికార్జున ఖర్గే చేసిన ట్వీట్ 

    महाकुंभ के दौरान, तीर्थराज संगम के तट पर हुई भगदड़ से कई लोगों की जान गई है और अनेकों लोगों के घायल होने का समाचार बेहद हृदयविदारक है।

    श्रद्धालुओं के परिजनों के प्रति हमारी गहरी संवेदनाएँ और घायलों की शीघ्रातिशीघ्र स्वास्थ्य लाभ की हम कामना करते हैं।

    आधी अधूरी व्यवस्था,…

    — Mallikarjun Kharge (@kharge) January 29, 2025

    వివరాలు 

    యోగి నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి:  అఖిలేశ్ 

    కుంభమేళా నిర్వహణపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కూడా స్పందించారు.

    "ఈ ఘటనలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పై బాధ్యత ఉంది. కుంభమేళా నిర్వహణలో మిలకడత కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కుంభమేళా నిర్వహణను సైనికుల చేతికి అప్పగించాలి. ఈ ఘటనపై యోగి నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి" అని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    ఉత్తర్‌ప్రదేశ్

    UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌ భారతదేశం
    Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం భారతదేశం
    Fire Accident: శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి యోగి ఆదిత్యనాథ్
    UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025