PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్స వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ
అయోధ్యలో నిర్మించిన కొత్త రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2024 జనవరి 22న శ్రీరాముడి తిరిగి వచ్చిన ఈ చారిత్రక ఘట్టానికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 3 నిమిషాల 5 సెకన్ల వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ దానికి పలు వ్యాఖ్యాలను జోడించారు. 'జనవరి 22న చూసింది.. రాబోయే చాలా సంవత్సరాలు మన జ్ఞాపకాలలో సజీవంగా ఉంటుంది' అని పేర్కొన్నారు. అందంగా ముస్తాబైన్ అయోధ్య నగరంతో పాటు ప్రతిష్టాపన కోసం గర్భగుడిలోకి వెళుతున్న మోదీ, రామభక్తులు తమ ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోల ఆవిష్కృతమయ్యాయి.