NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు? 
    తదుపరి వార్తా కథనం
    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు? 
    దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?

    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు? 

    వ్రాసిన వారు Stalin
    Jul 26, 2023
    07:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం ఆమోదించారు.

    ఈ క్రమంలో దేశంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నది? తెలుసుకుందాం.

    భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఒక పార్టీ లేదా పార్టీల కూటమి అధికారంలో ఉండటానికి లోక్‍‌సభలో మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

    రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రిమండలి సమిష్టిగా లోక్‌సభకు జవాబుదారీగా ఉంటుంది.

    ప్రభుత్వంలో ఉన్న వారు అనర్హులని భావించినప్పుడు ప్రతిక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతాయి. అప్పుడు ఓటు ద్వారా ప్రభుత్వం లోక్‌సభలో తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

    లోక్ సభ

    అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఎలా ఉంటుంది?

    కనీసం 50మంది సభ్యుల మద్దతును పొందిన తర్వాత ఏ లోక్‌సభ సభ్యుడు అయినా అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడైనా ప్రవేశపెట్టవచ్చు.

    ఆ తర్వాత స్పీకర్ చర్చకు తేదీని నిర్ణయిస్తారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్న ఎంపీలు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపగా, ట్రెజరీ బెంచ్‌లు లేవనెత్తిన సమస్యలపై స్పందిస్తాయి.

    చివరగా ఓటింగ్‌ను నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌లో ప్రభుత్వం మెజారిటీని నిరూపించడంలో విఫలమైతే సర్కారు రద్దు అవుతుంది.

    అయితే అవిశ్వాస తీర్మానం వల్ల ఎన్‌డీఏ ప్రభుత్వానికి 331మంది సభ్యుల మద్దతు ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేదు.

    543 సీట్ల లోక్‌సభలో మెజారిటీ మార్క్ 272 సీట్లు కాగా, ప్రతిపక్ష కూటమికి 144 మంది ఎంపీలు ఉన్నారు. తటస్థంగా 70 మంది ఎంపీలు ఉన్నారు.

    లోక్ సభ

    స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 27 అవిశ్వాస తీర్మానాలు

    స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్‌సభలో 27 అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు.

    1962 యుద్ధంలో చైనా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత 1963లో కాంగ్రెస్ నాయకుడు ఆచార్య కృపలానీ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా మోషన్‌ను ప్రవేశపెట్టారు.

    ఇందిరాగాంధీ అత్యధికంగా 15 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిర్మయి బసు నాలుగు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు.

    నరసింహారావు మూడు, మొరార్జీ దేశాయ్ రెండు, నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మోదీ ఒకటి చొప్పున విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.

    లోక్ సభ

    2003, 2018లో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలు

    1979లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైనప్పుడు, 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విఫలమైన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

    2003లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విఫలమయ్యారు. ఎన్.చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 2018లో మోదీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 126 మంది సభ్యులు మద్దతు ఇవ్వగా, 325 మంది సభ్యులు తిరస్కరించారు.

    అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యసభలో కాకుండా, లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగువ సభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. అందుకే రాజ్యసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అవిశ్వాస తీర్మానం
    లోక్‌సభ
    బీజేపీ
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అవిశ్వాస తీర్మానం

    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ

    లోక్‌సభ

    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    బీజేపీ

    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన నరేంద్ర మోదీ
    బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు  కాంగ్రెస్
    వచ్చే ఎన్నికలు బండి సంజయ్ నేతృత్వంలోనే.. మరోసారి తేల్చిచెప్పిన తరుణ్ చుగ్ బండి సంజయ్
    వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం మహారాష్ట్ర

    నరేంద్ర మోదీ

    నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు  భారతదేశం
    ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే  వరంగల్ తూర్పు
    కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక  ప్రధాన మంత్రి
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025