NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం 
    ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం

    Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలను ప్రారంభించింది.

    ఈ సేవలు జనవరి 30 (రేపటి) నుంచి అందుబాటులోకి రానున్నాయి.

    వాట్సప్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మొదటి దఫాలో 161 సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

    ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబరును ప్రకటించనుంది.

    ఆ నంబరుకు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంటుంది. ఈ నంబరుతో సంబంధిత సేవలు వన్‌స్టాప్‌ సెంటర్‌గా పనిచేస్తాయి.

    తొలిదశలో 161 రకాల సేవలు అందించబడతాయి, భవిష్యత్తులో వీటిని మరింత విస్తరించనున్నారు.

    వివరాలు 

    ప్రభుత్వ సమాచారం చేరవేత 

    ప్రభుత్వం ప్రజలకు ఏదైనా సమాచారాన్ని చేరవేయాలనుకుంటే, ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా సందేశం పంపబడుతుంది. ఉదాహరణకు:

    ''భారీవర్షాలు, వరదల కారణంగా.. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం.''

    ''వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి.''

    ''మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండండి.''

    ''మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి'' వంటి సమాచారాన్ని ఒక్కసారిగా కోట్లమందికి చేరవేస్తారు.

    వివరాలు 

    వినతుల స్వీకరణ, పరిష్కారం 

    ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ నంబరుకు మెసేజ్‌ చేస్తే, వెంటనే వారికి ఒక లింక్‌ పంపబడుతుంది.

    అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా పూరించటం ద్వారా వినతిని పంపవచ్చు.

    తరువాత వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు లభిస్తుంది. ఈ నంబరును ఉపయోగించి వారు ఇచ్చిన వినతి పరిష్కార స్థాయిని తెలుసుకోవచ్చు.

    వారు తమ పరిధిలో ఉన్న మురుగు కాలవల లీకేజీలు, రోడ్డు గుంతలు వంటివి ఫొటోలు తీసి పంపవచ్చు. వాతావరణ కాలుష్యం గురించి కూడా ఫిర్యాదులు చేయవచ్చు.

    వివరాలు 

    ప్రభుత్వ పథకాల సమాచారం 

    ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాలకు లబ్ధి పొందే విధానాలు ఈ వాట్సప్‌ నంబరుకు సందేశం పంపించి తెలుసుకోవచ్చు.

    పర్యాటక ప్రదేశాల సమాచారం

    రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌ ద్వారా పంపిస్తారు. వాటి నుంచి కావలసిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ టికెట్లు, వసతి సహా అన్ని సేవలు బుక్‌ చేసుకోవచ్చు.

    విద్యుత్తు బిల్లులు,పన్నుల చెల్లింపు

    విద్యుత్తు బిల్లులు,ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించవచ్చు.ట్రేడ్‌ లైసెన్సులు పొందవచ్చు.

    దేవాలయాల్లో దర్శనాల స్లాట్‌ బుకింగ్‌, వసతి బుకింగ్‌, విరాళాలు పంపడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

    రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్‌ రికార్డులు మరియు వివిధ సర్టిఫికెట్లను కూడా పొందవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా
    TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్.. భారతదేశం
    KRMB: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్  భారతదేశం
    Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు  భారతదేశం
    Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025