NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
    తదుపరి వార్తా కథనం
    Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
    Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

    Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

    వ్రాసిన వారు Stalin
    Dec 02, 2023
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలింగ్ తర్వాత 6,000 కోట్ల రైతుబంధు నిధులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

    ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నిధుల చెల్లింపులను నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వికాస్ రాజ్‌ను కలిసి మెమోరాండం సమర్పించారు.

    మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమలులో ఉందని కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు అభ్యర్థించారు.

    రైతుబంధు కింద పంపిణీకి ఎన్నికల సంఘం నిధులను అనుమతించనందున.. ఆ సోమ్మును కేసీఆర్ ప్రభుత్వం తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పంపిణీ చేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

    కాంగ్రెస్

    రాజీనామా చేసేందుకే 4న కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు: ఉత్తమ్

    హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వేలాది ఎకరాల భూములకు సంబంధించి భూముల పట్టా రికార్డులను మార్చేందుకు ధరణి పోర్టల్‌ను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

    గతంలో ఉన్న భూ రికార్డుల ప్రకారం ఇవి అసైన్డ్ భూములని పేర్కొంటూ, 'ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల బినామీలకు' బదలాయిస్తున్నారని చెప్పారు.

    సీఈవోను కలిసిన అనంతరం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విధివిధానాలు పాటించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.

    ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుత ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేయడానికి అనుమతించరాదన్నారు.

    గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకే కేసీఆర్ డిసెంబరు 4న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైతుబంధు
    కాంగ్రెస్
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రైతుబంధు

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు తెలంగాణ
    Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం  తెలంగాణ

    కాంగ్రెస్

    Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం  బిహార్
    Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్  ఎన్నికలు
    SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి  తెలంగాణ

    తాజా వార్తలు

    Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే తెలంగాణ
    Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్  ఉత్తర్‌ప్రదేశ్
    China Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి? చైనా
    Jack Ma: కొత్త కంపెనీని ప్రారంభించిన చైనా కుబేరుడు జాక్ మా.. పేరేంటో తెలుసా? చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025