NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై మరోసారి వివాదం.. ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యలు..
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై మరోసారి వివాదం.. ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యలు..
    రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై మరోసారి వివాదం..

    Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై మరోసారి వివాదం.. ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2025
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

    తాజాగా, మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

    ''దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, రాహుల్ గాంధీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎందుకు విదేశాలకు వెళ్లారు?'' అని ఆమె ప్రశ్నించారు.

    దేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో సంతాపం వ్యక్తం చేసినప్పుడు, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళడం మంచిదా అని ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

    వివరాలు 

    మన్మోహన్ సింగ్ చితాభస్మాన్ని సేకరించే కార్యక్రమానికి ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాలేదు 

    షర్మిష్ట ముఖర్జీ తన వ్యాఖ్యలలో, ''మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆయన చితాభస్మాన్ని సేకరించే కార్యక్రమానికి ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాలేదని వార్తల్లో చూశాను'' అని అన్నారు.

    పార్టీలోని నాయకులు, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ కుటుంబానికి సానుభూతి తెలిపే సమయం ఉండాలి.

    ప్రణబ్ ముఖర్జీ చనిపోయిన తర్వాత పార్టీ నేతల నుంచి వ్యక్తిగతంగా సానుభూతి పొందానని ఆమె చెప్పారు. ''కోవిడ్-19 సమయంలో చాలా మంది రాలేకపోయారు, కానీ ఇప్పుడు కోవిడ్ లేదు, అప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లిపోయారు?'' అని ఆమె అడిగారు.

    వివరాలు 

    గాంధీలకు, కాంగ్రెస్ పార్టీకి సిక్కులపై ద్వేషం

    గత వారం, బీజేపీ కూడా రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్రంగా విమర్శలు గుప్పించింది.

    ''ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి దేశం సంతాపం వ్యక్తం చేస్తుంటే, రాహుల్ గాంధీ కొత్త సంవత్సరాన్ని వేడుక చేసేందుకు వియత్నాంకు వెళ్లారు. ఆయన మరణాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నారని'' బీజేపీ ఆరోపించింది.

    గాంధీలకు, కాంగ్రెస్ పార్టీకి సిక్కులపై ద్వేషం ఉందని బీజేపీ తన విమర్శను వ్యక్తం చేసింది.

    ఇందిరా గాంధీ దర్బార్ సాహిబ్‌ను అపవిత్రం చేసిందని ఎప్పటికీ మరచిపోవద్దని బీజేపీ గుర్తు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాహుల్ గాంధీ

    దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా  అమిత్ షా
    Rahul Gandhi: యూఎస్‌లో రాహుల్ గాంధీ-ఇల్హాన్ ఒమర్ భేటీ.. దేశవ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అని బీజేపీ విమర్శలు బీజేపీ
    Rahul Gandhi: 50 శాతానికి మించి రిజర్వేషన్లు కలిపిస్తాం.. రాహుల్‌ గాంధీ క్లారిటీ భారతదేశం
    Rahul Vs CR Kesavan: రాహుల్ గాంధీపై కేశవన్ ఫైర్.. అమెరికా పర్యటన 'భారత్ బద్నాం యాత్ర' బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025