English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?
    తదుపరి వార్తా కథనం
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు 4 శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?

    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2024
    09:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడికి అభిషేకం చేయనున్నారు.

    అయితే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి దేశంలోని ఇద్దరు శంకరాచార్యులు హాజరయ్యేందుకు నిరాకరించారు.

    నలుగురు శంకరాచార్యుల్లో ఇద్దరు హాజరు కావడం లేదని చెప్పడంతో పాటు మరో ఇద్దరు మౌనంగా ఉన్నారు.

    రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి శంకరాచార్యులు హాజరుకాకపోవడానికి గల కారణాలేమిటో పూరీలోని గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మహరాజ్ తెలిపారు.

    అహంతో ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు దూరంగా ఉండటం లేదన్నారు. శంకరాచార్యుల గౌరవాన్ని నిలబెట్టడానికి తీసుకున్న నిర్ణయంగా చెప్పుకొచ్చారు.

    అయోధ్య

    ప్రధానమంత్రి గర్భగుడిలో ఉండటం వెనుక రాజకీయ కోణం:   నిశ్చలానంద సరస్వతి 

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు అక్కడ బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని వారు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.

    గతవారం కూడా పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంపై మాట్లాడారు.

    శ్రీరాముని ప్రతిష్ఠాపనను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి గర్భగుడిలో ఉండటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు ఆయన చెప్పారు.

    అయితే తాము దీన్ని వ్యతిరేకించడం లేదు.. కానీ హాజరు మాత్రం కావడం లేదన్నారు.

    ఇతర కారణాలతో పాటు.. గర్భగుడిలో మోదీ ఉండటం వల్ల తాము హాజరు కాబోమని ఉత్తరాఖండ్‌లోని చమోలీలోని జోషిమఠ్ మఠానికి చెందిన శంకరాచార్యులు చెప్పారు.

    మీరు
    25%
    శాతం పూర్తి చేశారు

    అయోధ్య

    నలుగురు శంకరాచార్యుల ఎవరు?

    సనాతన ధర్మంలో శంకరాచార్య పదవి అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు. హిందూమత వ్యాప్తి కోసం ఆదిశంకరాచార్యులు భారతదేశంలో నాలుగు దిక్కుల్లో నాలుగు మఠాలను స్థాపించారు.

    నాలుగు మఠాల్లో ఉత్తరాన బదరికాశ్రమానికి చెందిన జ్యోతి మఠం, దక్షిణాన శృంగేరి మఠం, తూర్పున జగన్నాథపురి గోవర్ధన్ మఠం, పశ్చిమాన ద్వారకలోని శారదా మఠం ఉన్నాయి.

    ఈ నాలుగు మఠాల అధిపతిని శంకరాచార్యులు అంటారు. ఈ మఠాలను స్థాపించిన తరువాత, ఆదిశంకరాచార్య తన నలుగురు ప్రధాన శిష్యులకు బాధ్యతను అప్పగించారు.

    ప్రస్తుతం ఒడిశాలోని పూరిలోని గోవర్ధన్ మఠాధిపతిగా నిశ్చలానంద సరస్వతి శంకరాచార్య, గుజరాత్‌లోని ద్వారకాధామ్‌లోని శారదా మఠానికి సదానంద సరస్వతి, ఉత్తరాఖండ్‌లోని బదరికాశ్రమంలోని జ్యోతిర్మఠానికి స్వామి అవిముక్తేశ్వరానంద్, రామేశ్వరంలో ఉన్న శృంగేరి మఠానికి జగద్గురు భారతీ తీర్థ శంకరాచార్యగా ఉన్నారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    అయోధ్య

    మౌనంగా ఇద్దరు శంకరాచార్యులు

    శృంగేరి మఠానికి చెందిన శంకరాచార్య భారతీ తీర్థులు, గుజరాత్‌లోని ద్వారకలోని శారదా పీఠానికి చెందిన శంకరాచార్య సదానంద సరస్వతి అయోధ్యకు వెళ్లడంపై ఇంకా స్పందించలేదు.

    వారు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నటికీ.. వారు మాత్రం మౌనం వీడటం లేదు.

    అయితే మౌనంగా ఉన్నారంటే.. వారు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.

    రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవడంపై నలుగురు శంకరాచార్యులు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిశ్చలానంద సరస్వతి శంకరాచార్య స్పందిచారు.

    తమ మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. తాము నలుగురం రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదన్నారు.

    మీరు
    75%
    శాతం పూర్తి చేశారు

    అయోధ్య

    శంకరాచార్యుల ప్రకటనపై రాజకీయ రగడ

    శంకరాచార్యులు చేసిన ప్రకటనపై రాజకీయ రగడ నెలకొంది. రామాలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

    శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను రాజకీయ కార్యక్రమంగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శించింది.

    హిందూ వ్యతిరేకిగా ఆరోపణలు గుప్పించింది. ఇదే సమయంలో ఇద్దరు శంకరాచార్యులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని ప్రకటించారు.

    అంతేకాదు, ఆలయం అసంపూర్తిగా ఉండగానే ప్రారంభిస్తున్నారని స్వయంగా ఈ ఇద్దరు మతపెద్దలు విమర్శించడం.. ఇప్పుడు బీజేపీని ఇరుకునే పెట్టే అంశమైంది.

    దీంతో కాంగ్రెస్‌ను బీజేపీ విమర్శించడానికి అవకాశం లేకుండా పోయింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    నరేంద్ర మోదీ
    శ్రీరాముడు
    తాజా వార్తలు

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు ప్రధాన మంత్రి
    Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ  ఉత్తరాఖండ్
    Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు కేంద్ర ప్రభుత్వం
    PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్ పార్లమెంట్

    శ్రీరాముడు

    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు  అయోధ్య
    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం  జీ20 సదస్సు
    అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు  అయోధ్య

    తాజా వార్తలు

    Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు  గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    Elon Musk: ట్విట్టర్(ఎక్స్‌)లో హానికర కంటెంట్‌ అందుకే పెరిగిందట  ఎక్స్
    India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా?  టీమిండియా
    Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025