NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు
    భారతదేశం

    'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు

    'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 20, 2023, 04:40 pm 0 నిమి చదవండి
    'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు
    మోర్బీ బ్రిడ్జి కూలినఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఘోరంగా విఫమైన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది. గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో 135 మంది మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. ఈ ఘటనను గుజరాత్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. 135 మంది మరణించిన ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది.

    ఈ నెల 25వ తేదీలోపు వివరణ ఇవ్వాలి: ప్రభుత్వం

    ఈ నెల 25వ తేదీలోపు షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని మోర్బీ మున్సిపాలిటీకి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. పాలక వర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి, తీర్మానం రూపంలో లిఖితపూర్వకంగా ఆ వివరణ ఉండాలని మున్సిపాలిటిని ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 13న హైకోర్టులో విచారణ సందర్భంగా కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించిన మున్సిపాలిటీ పాలక వర్గాన్ని రద్దు చేయనున్నట్లు ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో పిల్‌ను కూడా దాఖలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వంతెనలు ఉన్నాయో వాటిపై సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    గుజరాత్

    తాజా

    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్

    గుజరాత్

    కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ జమ్ముకశ్మీర్
    దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి భారతదేశం
    ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక నరేంద్ర మోదీ
    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ ఆటో మొబైల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023