NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు
    తదుపరి వార్తా కథనం
    'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు
    మోర్బీ బ్రిడ్జి కూలినఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు

    'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు

    వ్రాసిన వారు Stalin
    Jan 20, 2023
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఘోరంగా విఫమైన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది.

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో 135 మంది మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. ఈ ఘటనను గుజరాత్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. 135 మంది మరణించిన ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది.

    గుజరాత్

    ఈ నెల 25వ తేదీలోపు వివరణ ఇవ్వాలి: ప్రభుత్వం

    ఈ నెల 25వ తేదీలోపు షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని మోర్బీ మున్సిపాలిటీకి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. పాలక వర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి, తీర్మానం రూపంలో లిఖితపూర్వకంగా ఆ వివరణ ఉండాలని మున్సిపాలిటిని ఆదేశించింది.

    గతేడాది డిసెంబర్ 13న హైకోర్టులో విచారణ సందర్భంగా కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించిన మున్సిపాలిటీ పాలక వర్గాన్ని రద్దు చేయనున్నట్లు ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో పిల్‌ను కూడా దాఖలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వంతెనలు ఉన్నాయో వాటిపై సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025