NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి 
    తదుపరి వార్తా కథనం
    చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి 
    చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి

    చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి 

    వ్రాసిన వారు Stalin
    Oct 25, 2023
    07:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం తిరుపతి జిల్లా నుంచి 'నిజం గెలవాలి' యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న నేపథ్యంలో మరణించిన వారి బంధువులను ఓదార్చేందుకు ఈ యాత్రను ప్లాన్ చేశారు.

    ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన భువనేశ్వరి.. ఈ యాత్ర ద్వారా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి.

    బస్సు యాత్ర వివిధ దశల్లో ఉంటుంది. మొదటి దశలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పాటు ఉండనుంది.

    తొలిరోజు చంద్రగిరిలో చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన నేండ్రగుంట గ్రామానికి చెందిన కె. చిన్నబ్బ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.

    చంద్రబాబు

    చంద్రబాబు ఎప్పుడు ప్రజలకోసమే ఆలోచించారు: భువనేశ్వరి 

    ఓదార్పు అనంతరం ఏర్పాటు అగరాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడారు.

    తాను రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదన్నారు. నిజం గెలవాలని, ఈ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.

    ఇది తన ఒక్కరి పోరాటం కాదన్నారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజలకోసమే ఆలోచించారన్నారు.

    ప్రజల తర్వాతే కుటుంబం గురించి ఆలోచించేవాళ్లన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్‌ కేసులు తన భర్తపై బనాయించారని, అందులో ఒక్క కేసుకైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

    రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన నిత్యం కష్టపడ్డారన్నారు. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారన్నారు.

    తన కుమారుడు లోకేశ్‌ చేపట్టిన యువగళం యాత్రను కూడా ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారన్నారు. అయినా, ఏమీ చేయలేకపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    తిరుపతి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు నాయుడు

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ ఆంధ్రప్రదేశ్
    ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ ముఖ్యమంత్రి
    స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్  సీఐడీ
    Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు  ఆంధ్రప్రదేశ్

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025