NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి
    యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం

    నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 10, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో సైకిల్ గుర్తుపై పోటీ చేసే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

    శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో ఆనంపై వైకాపా అధిష్ఠానం వేటు వేసింది.ఈ నేపథ్యంలో ఆనం గత రాత్రి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో సమావేశం అవ్వడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.

    అనంతరం హైదరాబాద్ నుంచి ఆనం నెల్లూరుకు వచ్చేశారు. ఈ క్రమంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు తెదేపా ఉమ్మడి జిల్లా నేతలు, మాజీ మంత్రులు సోమిరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

    టీడీపీ 

    జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తాం: ఆనం

    ఈ నేపథ్యంలో నెల్లూరులో జరగబోయే లోకేశ్‌ యువగళం పాదయాత్ర స్వాగత ఏర్పాట్లపై నేతలు చర్చించుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆనం, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో జరగబోతోందన్నారు.

    నిన్ననే పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడానని, నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రను సమర్థంగా నిర్వహించేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.

    ఉమ్మడి జిల్లాలోని నేతలందరిని కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. జిల్లాలో పాదయాత్ర పూర్తి అయ్యాక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరులో యువగళం పాదయాత్రను జయప్రదం చేస్తామని ఆనం తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నెల్లూరు రూరల్

    తాజా

    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    నెల్లూరు రూరల్

    'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025