NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?
    భారతదేశం

    దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?

    దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 25, 2023, 04:09 pm 0 నిమి చదవండి
    దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?
    దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?

    క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. ఏదైనా కేసులో దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త, పీహెచ్‌డీ స్కాలర్ ఆభా మురళీధరన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) కింద దోషి తేలిని ఎంపీ, ఎమ్మెల్యేను ఆటోమేటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడం ఏకపక్షమే కాకుండా చట్టవిరుద్ధం కూడా అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. రెండేళ్ల గరిష్ట శిక్ష పడిన సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేను ఆటోమేటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడమనేది ప్రజాప్రతినిధి వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణను ఉల్లంఘించటమే అవుతుందని మురళీధరన్ తన పిటిషన్‌లో వెల్లడించారు.

    వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం

    సెక్షన్ 8(3) అనేది ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడు లేదా శాసనసభ సభ్యుని స్వేచ్ఛా ప్రసంగాన్ని పరిమితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యులు వారి సంబంధిత నియోజకవర్గ ఓటర్లు తమపై విధించిన విధులను స్వేచ్ఛగా నిర్వర్తించకుండా ఈ సెక్షన్ నిరోధిస్తుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీని లోక్‌సభకు అనర్హులుగా ప్రకటించి, నేరపూరిత పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఈ పిటిషన్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పిటిషన్‌ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సుప్రీంకోర్టు
    రాహుల్ గాంధీ
    ఇండియా లేటెస్ట్ న్యూస్
    తాజా వార్తలు

    సుప్రీంకోర్టు

    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు తాజా వార్తలు
    ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు కడప

    రాహుల్ గాంధీ

    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  దిల్లీ
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  కాంగ్రెస్
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  నరేంద్ర మోదీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  తెలంగాణ

    తాజా వార్తలు

    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  తెలంగాణ
    PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే చెల్లింపు
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  కర్నూలు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023