NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ
    తదుపరి వార్తా కథనం
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు, విచారణకు అంగీకరించిన ధర్మాసనం

    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ

    వ్రాసిన వారు Stalin
    Mar 24, 2023
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.

    భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని ఏప్రిల్ 5న విచారించడానికి అంగీకరించింది.

    దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ 14 రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.

    సుప్రీంకోర్టు

    అరెస్టుకు ముందు, తర్వాత మార్గదర్శకాలను చెప్పండి: న్యాయవాది సంఘ్వీ

    దర్యాప్తు సంస్థలు ఏలా వ్యవహరించాలనే దానిపై మార్గదర్శకాలను కోరుతూ సింఘ్వీ సుప్రీంకోర్టు ఎదుట పిటిషన్‌ను సమర్పించారు.

    ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నాయని, 95 శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపై ఉన్నాయని న్యాయవాది సింఘ్వీ అన్నారు. అరెస్టుకు ముందు మార్గదర్శకాలు, అరెస్టు తర్వాత మార్గదర్శకాలను తాము అడుగుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని 14రాజకీయ పార్టీలు చెబుతున్నాయని న్యాయవాది సంఘ్వీ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.

    డీఎంకే, రాష్ట్రీయ జనతా దళ్, భారత రాష్ట్ర సమితి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్‌సీపీ, శివసేన ఉద్ధవ్ క్యాంపు, జార్ఖండ్ ముక్తి మోర్చా, సీపీఐ, జేడీయూ, సీపీఎం, ఎస్పీ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    సీబీఐ
    కాంగ్రెస్

    తాజా

    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్
    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్

    సుప్రీంకోర్టు

    పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ భారతదేశం
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర మోదీ
    ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జమ్ముకశ్మీర్

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    కాంగ్రెస్

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన గౌతమ్ అదానీ
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ రాహుల్ గాంధీ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025