NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ
    భారతదేశం

    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ

    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 23, 2023, 05:18 pm 1 నిమి చదవండి
    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ
    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ

    పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా 2015-16లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. అదే సమయంలో అతని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ మాల్యా విదేశాల్లో ఆస్తులను కొన్నారని చెప్పింది. గురువారం ఈ మాల్యాకు కేసుకు సంబంధించి ముంబయి కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మాల్యా ఎగ్గొట్టిన రుణాలను బ్యాంకులు రికవరీ చేయలేదని సీబీఐ తాజా చార్జిషీట్‌లో పేర్కొంది. 900 కోట్లకు పైగా ఐడీబీఐ బ్యాంక్-కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల మోసం కేసులో మాల్యా నిందితుడిగా ఉన్నారు.

    ఫ్రాన్స్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, పిల్లల ట్రస్ట్‌కు నగదు బదిలీ

    2008 నుంచి 2017 మధ్య బ్యాంకులకు తిరిగి చెల్లించడానికి మాల్యా వద్ద తగినంత డబ్బు ఉందని, అతను తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (కేఎఎల్) కోసం రుణాలు తీసుకున్నాడని సీబీఐ వెల్లడించింది. తన వద్ద ఉన్నడబ్బుల్లో కొంత మొత్తాన్ని స్విట్జర్లాండ్‌లోని తన పిల్లల ట్రస్ట్‌లకు డబ్బును బదిలీ చేసినట్లు సీబీఐ గుర్తించింది. కోర్టు అనుమతితో మాల్యా లావాదేవీల వివరాలను కోరుతూ వివిధ దేశాలకు సీబీఐ లేఖలు రాసింది. మాల్యా ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ పేర్కొంది. 2016లో భారతదేశం నుంచి పరారైన మాల్యా ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు. అయితే అతన్ని తిరిగి విచారణకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    వ్యాపారం
    హైకోర్టు
    సీబీఐ
    ముంబై

    వ్యాపారం

    PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే చెల్లింపు
    2023లో వార్షిక వేతనాన్ని 50శాతం తగ్గించుకున్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ  విప్రో
    59ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  బిజినెస్
    ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు  భారతదేశం

    హైకోర్టు

    అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు కడప
    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  బీబీసీ
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్
    అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ అమరావతి

    సీబీఐ

    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం వైఎస్సార్ కడప
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  కర్ణాటక

    ముంబై

    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023